Jump to content

Inka waiting entehe...


Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=582812

 

ఆ వజ్రం శ్రీవారిదైతే ఆ ఇద్దరినీ అరెస్టు చేయాలి
24-05-2018 00:59:07
 
  • రమణదీక్షితులు, ఐవైఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు
  • సుప్రీం న్యాయవాది డీవీ రావు వెల్లడి
విజయవాడ, మే 23 (ఆంధ్రజ్యోతి): జెనీవాలో వేలం వేశారంటున్న వజ్రం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిదే అయితే.. నాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో పాటు టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావులను అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్‌ డీవీ రావు అన్నారు. కస్టమ్స్‌ అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని, బుధవారం కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చిన ఆయన తాజా వివాదంపై విలేకరులతో మాట్లాడారు. ‘అర్చకులు కారుణ్య నియామకాలను కోరవచ్చు. కానీ రిటైర్మెంట్‌ తర్వాత వంశపారంపర్యంగా కోరడం సరికాదు. టీటీడీలో పదవీవిరమణ వయసు నిబంధన పాలసీ విషయమని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. 1987, 2012ల్లో జారీఅయిన జీవోలను 2018లో సవాల్‌ చేసే అవకాశం లేదు. ఆ జీవోల ప్రకారం 2013లో చాలా మంది రిటైరయ్యారు’ అని గుర్తుచేశారు.
 
‘2001లో తన సమక్షంలో గరుడ సేవలో పింక్‌ వజ్రం పగిలిందని రమణ దీక్షితులు చెబుతున్నారు. పగిలింది రూబీ అని, వజ్రం కాదని 2010లో అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ కూడా దానిని సమర్థించింది. ఈ నేపథ్యంలో జెనీవాలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదై ఉండవచ్చని రమణ దీక్షితులు పేర్కొనడంపై భక్తులు ఎవరైనా తమ సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. రమణ దీక్షితులుతో పాటు కృష్ణారావును కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...