koushik_k Posted May 24, 2018 Share Posted May 24, 2018 ప్రజా సమస్యలపై పోరుబాట పులివెందులవాసులకు అందుబాటులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యే జగన్మోహన్రెడ్డి పనితీరు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేక పోయినా... ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందున సోదరుడు, ఎంపీ అవినాష్రెడ్డికి నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. పులివెందుల ప్రాంతానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని గత ఏడాది పోలీస్ స్టేషన్ ఎదురుగా జగన్ దీక్ష కూడా చేశారు. పాదయాత్రకు ముందువరకు నెలలో ఒకటికి రెండుసార్లు పులివెందులకు వచ్చి ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వచ్చారు. ప్రతిపక్షనేత హోదాలోను ఇటు పులివెందుల్లోను, అటు కడపలోను సాగునీటి ప్రాజెక్టులపై రివ్యూలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ స్థానికంగా పులివెందుల్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలపై ఆయన దృష్టి పెట్టేంతగా ప్రజలకు దగ్గరగా అందుబాటులో లేరు. ఆయన లేనిలోటు ప్రజలకు, పార్టీకి కనిపించకుండా ఆయన సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడి నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. సాగు, తాగునీటి కోసం ఆయన పాదయాత్రలు, ధర్నాలు, వారానికోసారి పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లు గడిచింది. ఈ నాలుగేళ్లలో ఆయన పులివెందుల సమస్యలపై స్పందిస్తూ వచ్చారు. పాద యాత్రకు ముందువరకు నెలకోమారు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకొని వాటి కృషికి అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. నాలుగేళ్ల కాలంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం చూపడం కారణంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయామని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎప్పటికి కట్టుబడి ఉంటామన్నారు. జగన్ ప్రతిపక్షనేత కావడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేరని కొందరు ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలోనే మిగతా ప్రాంతాల్లోనే జగన్ ఎక్కువ పర్యటిస్తుంటారని, పులివెందులకు నెలకో రెండు నెలలకో మాత్రమే వస్తుంటారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజా సమస్యలకు నిధుల కొరత: ఎంపీ అవినాష్ పులివెందుల ఎమ్మెల్యేగా, ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. ఆయన ప్రతిపక్షనేత కావడంతో పులివెందుల ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తుంటారు. పులివెందులకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే నిధుల నుంచి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆయన చొరవ చూపుతుంటారు. కానీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతోంది. నిధుల కేటాయింపే లేకుండా జన్మభూమి కమిటీలతో, నియోకవర్గ ఇన్చార్జిలతో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతామని స్థానిక ఎమ్మెల్యేలను టీడీపీ నిర్లక్ష్యం చేస్తోంది. పులివెందుల ప్రాంతంలో సాగునీరు, తాగునీరు సమస్య లేకుండా చూసేందుకు జగన్ అనేకమార్లు పులివెందుల ఆర్అండ్బి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. కానీ అధికార పార్టీ అధికారులను ఈ సమావేశానికి రాకుండా అడ్డుకుంటూ వచ్చారు. అయినా ఆయన ప్రజల సమస్యలపై పోరాడుతూనే వస్తున్నారు. మా ఎమ్మెల్యే అందుబాటులో లేరు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుబాటులో లేరు. ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైన సమస్య ఉన్నా జగన్ను కలిసే పరిస్థితి లేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. జగన్ కూడా అదేస్థాయిలో చేస్తారని వైఎస్ను చూసి ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నాం. కానీ ఆయన అందుబాటులో లేరు. ఎస్.వాసుదేవరెడ్డి, ముసల్రెడ్డిగారిపల్లె, సింహాద్రిపురం మండలం జగన్ కంటే అవినాష్ రెడ్డి అందుబాటులో ఉంటారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుబాటులో ఉండకపోయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అందుబాటులో ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే ఎంపీకే వివరిస్తాం. జగన్ ప్రతిపక్ష నాయకుడు కావడంతో ఆయన రాష్ట్రంలో తిరుగుతుంటారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న కారణంగా ఆరు నెలలుగా ఆయన అందుబాటులో లేరు. ప్రసాదరెడ్డి, లింగాల సమస్యలు విన్నవించాలన్నా జగన్ అందుబాటులో లేరు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏదైనా సమస్య విన్నవించాలన్నా అందుబాటులో లేరు. జగన్ ప్రతిపక్షనేత కావడంతో పులివెందుల్లో తక్కువగా ఉంటారు. నెలకో రెండు నెలలకో ఓ మారు వస్తే ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించమని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగిస్తారు. అవినాష్ రెడ్డి అందుబాటులో ఉండడంతో స్థానిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఆయనకే వివరిస్తాం. కొమ్మెర వెంకట కుళాయప్ప, పులివెందుల ప్రజా సమస్యలపై జగన్ పోరాటం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. ఇక్కడి సమస్యలపై పులివెందుల్లో ఆందోళన కూడా జగన్ చేశారు. జగన్ ప్రతిపక్షనేత కావడంతో ఆయన రాష్ట్రంలో తిరుగుతూ ఉంటారు. స్థానిక సమస్యలపై అవినాష్ రెడ్డి పోరాడుతుంటారు. సాగునీటి, తాగునీటి కోసం ఆయన పాదయాత్ర కూడా చేశారు. Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted May 24, 2018 Share Posted May 24, 2018 So what? aadike guddedi malli Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted May 24, 2018 Author Share Posted May 24, 2018 1 hour ago, Nandamuri Rulz said: So what? aadike guddedi malli anthe Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.