Jump to content

Papam nidra kuda pattatam ledanukunta


JVC

Recommended Posts

కాంగ్రెస్‌, జేడీఎస్‌ల సంబరాలు దేనికి?
మీడియాతో అమిత్‌ షా
 

05044621BRK-AMIT.JPG

దిల్లీ: కర్ణాటక ఎన్నికల తీర్పు అనంతరం జేడీఎస్‌తో కాంగ్రెస్‌‌ పొత్తు పెట్టుకోవడాన్ని భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే బలనిరూపణ చేసుకోలేక రాజీనామా చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో అమిత్‌ షా దిల్లీలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

‘కర్ణాటకలో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాకు బాగానే ఓట్లు పడ్డాయి. అసలు కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఎందుకు సంబరాలు జరుపుకొంటున్నాయి? కాంగ్రెస్‌ మంత్రుల్లో సగం మంది ఓడిపోయారు. సీఎం అభ్యర్ధి ఒక నియోజకవర్గంలో ఓటమిపాలయ్యాడు. ఇక జేడీఎస్‌ 37 సీట్లు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోందా? ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌లు‌ పొత్తు పెట్టుకున్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎన్నికల కమిషన్‌, ఈవీఎంలు నచ్చుతాయి. ఎందుకంటే విజయం సాధించలేకపోయినప్పటికీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి. ఇదే విధంగా ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్‌కు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ నచ్చుతాయని.. సుప్రీం కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటుందని కోరుకుంటున్నాను.బలనిరూపణకు యడ్యూరప్ప ఏడు రోజులు అడిగారని సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌ న్యాయవాది అబద్ధం చెప్పారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రజలకు మోసం చేశారు. పొత్తుతో వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో ఇరు పార్టీలకు త్వరలో తెలిసొస్తుంది. ఆధిపత్యం పవర్‌తో రాదు. ప్రజల ప్రేమతో వస్తుంది. మాటిమాటికీ మణిపూర్‌లో భాజపా ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆరోపణలు చేస్తున్నారు. మాకు హక్కు ఉంది కాబట్టే అక్కడ ప్రభుత్వాన్నిఏర్పాటుచేశాం. ’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...