Jump to content

Recommended Posts

మోదీ ఆశలన్నీ ఇక గల్లంతేనా!? 
17-05-2018 16:25:26
 
636621711271638754.jpg
ముంబై : అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు కష్టాల్లో పడబోతోంది. దీని కోసం భూములిచ్చేందుకు మహారాష్ట్ర, గుజరాత్ రైతులు సుముఖంగా లేరు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల రైతన్నల మధ్య వివాదం రేగింది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా లేవు.
 
భారతదేశం, జపాన్ సంయుక్తంగా అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టాయి. దీని కోసం భూసేకరణ ప్రారంభమైంది. అయితే నష్ట పరిహారం విషయంలో మహారాష్ట్ర, గుజరాత్ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు నష్టపరిహారం తక్కువగా ఉందని చెప్తుండగా, మరికొందరు తమ భూములిచ్చేందుకు ముందుకు రావడం లేదు.
 
అహ్మదాబాద్‌లో పర్యాటక ఉత్సవాలకు హాజరైన జపాన్ కాన్సుల్ జనరల్ నోడా మాట్లాడుతూ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2023నాటికి పూర్తవ్వాల్సి ఉందన్నారు. అంటే ఐదేళ్ళు మాత్రమే మిగిలిందన్నారు. ఈ సమయం ఎక్కువేమీ కాదన్నారు. భూమి సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. భారతదేశం, జపాన్ ఈ ప్రాజెక్టు కోసం సన్నిహితంగా కృషి చేస్తున్నాయన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...