Jump to content

టీడీపీ నేతలుంటే సస్పెండ్‌ చేయండి: చంద్రబాబు


Recommended Posts

గుంటూరు: తిరుపతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జరిగిన దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అమిత్‌షాపై దాడి చేసినవారిలో టీడీపీ నేతలుంటే సస్పెండ్‌ చేయండని పార్టీ రాష్ట్ర నేతలకు చంద్రబాబు ఆదేశించారు. అమిత్‌షా కాన్వాయ్‌ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని.. ఆందోళనకు దిగడాన్ని చంద్రబాబు ఖండించారు. తెలుగు తమ్ముళ్ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
 
 
అమిత్‌షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా అలిపిరి దగ్గర టీడీపీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. అనంతరం కాన్వాయ్‌పై దాడి చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని లాఠీచార్జీ జరిపారు. టీడీపీ కార్యకర్తల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...