Jump to content

Hero Shivaji


NatuGadu

Recommended Posts

ఆపరేషన్‌ గరుడ ఆగలేదు: సినీనటుడు శివాజీ 
20brk131a.jpg

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని మున్సిపల్‌ మైదానంలో చేస్తున్న ధర్మపోరాట దీక్షకు సినీనటుడు శివాజీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఆందోళన చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘ప్రతి వూరిలో రైలు ట్రాక్‌పై కూర్చొని ఆందోళన చేద్దాం. రైల్వే కేసులు వద్దనుకుంటే ప్రతి వూరిలో ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయి. ఆపరేషన్‌ గరుడ ఇంకా ఆగలేదు. ఏపీని అలజడిలో పెట్టాలని చూస్తున్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు త్యాగం చేశారు. మీ త్యాగం వృథా కాదు. గొప్ప రాజధాని అవుతుంది. రాజధానిపై కుట్రతో చేసే వారి ఆరోపణలను రైతులు నమ్మవద్దు. 75వేల ఎకరాల్లో నయారాయ్‌పూర్‌ నిర్మించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఏం చేశారని పవన్‌ కల్యాణ్‌ అడుగుతున్నారు. మద్రాస్‌ లాంటి గొప్పరాజధాని ఉండటం వల్లే ఎన్టీఆర్‌ గొప్పనటుడు, రాజకీయ నాయకుడు అయ్యారు. చిరంజీవి మెగాస్టార్‌ అయ్యారు. ఏం ఇచ్చారని వీళ్లంతా మద్రాస్‌ వెళ్లారు? ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈనెల 30న అన్ని విషయాలు చెబుతా’’ అని శివాజీ వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...