sonykongara Posted March 30, 2018 Share Posted March 30, 2018 బాలకృష్ణ కోసం రీమేక్ స్టోరీని ఎంచుకున్న వినాయక్ Updated : 30-Mar-2018 : 20:20 ‘ఎన్టీయార్’ బయోపిక్ దసరాను టార్గెట్ చేయడంతో ఆ తర్వాత తెరకెక్కబోతున్న బాలకృష్ణ సినిమాపై ఇప్పుడే అందరిలో ఆసక్తి నెలకొంది. వినాయక్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మించబోయే ఈ చిత్రం ఎన్టీయార్ బయోపిక్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందట. ఒకటిన్నర దశాబ్దం క్రితమే బాలకృష్ణ-వినాయక్ కాంబినేషన్లో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా వచ్చింది. వినాయక్ కథతో రూపొందిన 'చెన్నకేశవరెడ్డి' చిత్రం అభిమానులను ఎంతగానో అలరించింది. అయితే ఈసారి బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చేందుకు రీమేక్ కథను ఎంచుకున్నాడట వినాయక్. కన్నడలో హిట్టయిన శివరాజ్ కుమార్ ‘మఫ్టీ’ చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించబోతున్నాడట. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ సినిమాలో నటసింహ.. గ్యాంగ్స్టర్ రోల్లో అలరించనున్నాడట. ఈ ఏడాది బాలకృష్ణతో ‘జై సింహా’, వినాయక్తో ‘ఇంటిలిజెంట్’ చిత్రాలను అందించిన సి. కళ్యాణ్.. ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టుకున్న ఈ చిత్రం మే 27న అఫీషియల్గా లాంఛ్ కానుందట. మొత్తం మీద రీమేక్ స్టోరీస్తో మరో సీనియర్ హీరో చిరంజీవికి ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ వంటి హిట్ చిత్రాలను అందించిన వినాయక్.. ఇప్పుడు బాలకృష్ణకు కూడా కన్నడ రీమేక్తో భారీ విజయాన్ని అందిస్తాడేమో చూడాలి Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.