Jump to content

తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వెబ్‌సైట్ వ్యవస్థాపకుడి అరెస్ట్


Recommended Posts

తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వెబ్‌సైట్ వ్యవస్థాపకుడి అరెస్ట్
30-03-2018 10:27:03
 
636580024240134367.jpg
బెంగళూరు : జైన మత సన్యాసిపై ముస్లిములు దాడి చేశారని తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వెబ్‌సైట్ వ్యవస్థాపకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. హాసన్ జిల్లా శ్రవణబెలగోలాలో గోమతేశ్వర మహామస్తాభిషేక కార్యక్రమంలో జైన మత సన్యాసి మయాంక్ సాగర్ పాల్గొనేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. కాగా ముస్లిముల దాడిలోనే జైన మత సన్యాసి గాయపడ్డాడని తప్పడు వార్తలను పోస్టుకార్డు వెబ్‌సైట్ ద్వారా వ్యాప్తి చేశాడు. సమాజంలో అల్లర్లు సృష్టించేందుకు పోస్టుకార్డు వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు మహేష్ విక్రమ్ హెగ్డే తప్పుడు వార్తలు ఇచ్చాడని బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మహేష్ విక్రమ్ హెగ్డేను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా అతన్ని 14 రోజుల పోలీసు కస్టడీకి పంపించాడని పోలీసు కమిషనర్ సతీష్ కుమార్ చెప్పారు. జర్నలిస్టును అరెస్టు చేయడం సిగ్గు చేటు అంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అధికార కాంగ్రెస్ వైఖరిపై ట్విట్టర్ లో విమర్శలు కురిపించాడు. దీనిపై స్పందించిన కర్ణాటక హోంశాఖ మంత్రి రామలింగారెడ్డి ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం సర్వసాధారణమేనని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...