srinivas_sntr Posted March 23, 2018 Share Posted March 23, 2018 న్యూదిల్లీ: త్వరలోనే వంట గ్యాస్ ధరను ప్రభుత్వం పెంచనుంది. వచ్చే నెల నుంచి సీఎన్జీతో పాటు, వంట గ్యాస్ ధర పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రతి ఆర్నెల్లకొకసారి గ్యాస్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం యూనిట్కు 2.89డాలర్లు చెల్లిస్తుండగా, వచ్చే నెల నుంచి ఇది 3.06 డాలర్లకు చేరనుంది. తాజాగా పెంపుతో సహజవాయువు ధర రెండేళ్ల గరిష్ఠానికి చేరనుంది. మార్చి 2016లో యూనిట్ గ్యాస్ ధర 3.82డాలర్లుగా ఉంది.సహజవాయువు ధర పెంపు కారణంగా విద్యుత్, యూరియా తయారీ ధర కూడా పెరగనుంది. భారత్లో వినియోగం అవుతున్న గ్యాస్లో సగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. దీనికి దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్కు చెల్లిస్తున్న దాని కన్నా రెట్టింపు చెల్లిస్తున్నారు. ధరలను పెంచడం ద్వారా ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీలకు మరింత ఆదాయం చేకూరనుంది. ఇతర వనరుల నుంచి సేకరించే గ్యాస్ ధరను కూడా ప్రభుత్వం పెంచనుంది. ముఖ్యంగా సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న గ్యాస్ను వెలికి తీసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ గ్యాస్ యూనిట్కు 6.3డాలర్లు లభ్యమవుతుండగా, దీని ధరను 6.5 డాలర్ల నుంచి 6.6 డాలర్లకు పెంచనున్నారు. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు గ్యాస్ ధరను ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.