Jump to content

కేంద్ర బడ్జెట్‌కు కీలక సవరణలు ప్రతిపాదించిన ఏపీ ఎంపీ


Recommended Posts

కేంద్ర బడ్జెట్‌కు కీలక సవరణలు ప్రతిపాదించిన ఏపీ ఎంపీ
13-03-2018 22:35:11
 
636565773128376406.jpg
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ఎంపీ గల్లా జయదేవ్ కీలక సవరణలు ప్రతిపాదించారు. ఆర్థిక బిల్లులోని క్లాజ్ 1 ఆఫ్ 2ని ఏపీకి వర్తింపజేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఏపీకి నిధుల కోసం ఆర్థికబిల్లులో కొత్త చాప్టర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుంధేల్‌ఖండ్ తరహా ప్యాకేజి ఇవ్వాలని, పోలవరం నిర్మాణంలో 2017 అంచనాల ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజికి నిధులు కేటాయించేలా సెక్షన్ 90లో సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. 13వ షెడ్యూల్‌లో కూడా పలు కీలక మార్పులు చేపట్టేలా సవరణలు జరగాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించేలా సెక్షన్ 94 ఆఫ్ 3లో సవరణలు చేపట్టాలని, ఏపీకి ఎఫ్ఆర్‌బీఎం పరిమితి కూడా పెంచాలంటూ జయదేవ్ ప్రతిపాదించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...