sonykongara Posted February 21, 2018 Share Posted February 21, 2018 ప్రధాని మోదీ ప్రకటన కవ్వింపు చర్యగా ఉంది: అచ్చెన్నాయుడు 21-02-2018 20:08:15 అమరావతి: ప్రధానమంత్రి బుందేల్ ఖండ్కు ప్రకటించిన ప్యాకేజీ చూస్తుంటే.. దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా? కాదా? అనే అనుమానం కలుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏబీఎన్తో మాట్లాడుతూ మోదీ బుందేల్ఖండ్కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారని, ఏపీ ప్యాకేజీ ఊసే ఎత్తడం లేదని, ఏపీ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నా కేంద్రంలో చలనం లేదని, కేంద్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఉందని అన్నారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా లేదని చెప్పి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారని, ప్యాకేజీలను వేరే రాష్ట్రాలకు ప్రకటిస్తున్నారని, దేశంలో ఏపీ భాగమేనని కేంద్రం గుర్తించాలని అచ్చెన్నాయుడు కోరారు. మోదీ ప్రకటనతో ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, రాజకీయ కోణంలోనే సమస్యలను చూస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సమస్యలపై జాతీయస్థాయిలో అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని, సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించామని, లేకపోతే అంగీకరించేవాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వేరే రాష్ట్రాలకు ఇస్తే ఏపీకీ ఇవ్వాల్సిందేనని, చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే విమర్శలు చేస్తున్నారని, రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా మేల్కోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.