sonykongara Posted February 14, 2018 Share Posted February 14, 2018 అనివార్యమైతే సుప్రీంకు! ఆఖరి మార్గంగా రాష్ట్ర ప్రభుత్వ యోచన రెవెన్యూ లోటుపై ప్రయత్నం ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికీ వెనుకాడకూడదని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించిన తర్వాతా ఏ ఫలితమూ లేకపోతే ఆఖరిమార్గంగా ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలని అనుకుంటోంది. రెవెన్యూ లోటుపై కేంద్రంతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక అధికారి మంగళవారం రాత్రి ‘ఈనాడు’కు ఈ విషయం చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యమైతే సుప్రీంకూ వెళ్లక తప్పదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రెవెన్యూ లోటు 16,078.76 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత కొంత కేంద్రం విడుదల చేసింది. తాజాగా రాష్ట్ర అధికారులు కేంద్రంతో మాట్లాడిన తర్వాత రూ.7070 కోట్ల రుణ మాఫీ సొమ్ము మినహాయించుకున్న తర్వాత కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి లెక్కించగా... రెవెన్యూ లోటు రూ.7,509 కోట్లుగా తేలింది. రూ.3520.50 కోట్లు ఇంకా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని అంగీకరించినా ఆ మొత్తం ఇచ్చేందుకు కేంద్ర అధికారులు ససేమిరా అంటున్నారని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ లోటు ఇక కేవలం రూ.138.38 కోట్లే ఇస్తామంటున్నారని వారంటున్నారు. ఇంకా దీనిపై ప్రయత్నాలు సాగుతున్నాయి Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.