Jump to content

APGENCO case in Tribunal court on #freepower usage


AnnaGaru

Recommended Posts

by the way AP also filing contempt of court petition against central home ministry..Center home ministry gave orders which is against Supreme court judgement on Asset sharing..

BJP(gujju gang) chesina mosam UPA kanna darunam AP ki...

 

https://www.deccanchronicle.com/nation/current-affairs/081217/andhra-pradesh-to-file-contempt-plea-against-centre.html

Link to comment
Share on other sites

26 minutes ago, AnnaGaru said:

by the way AP also filing contempt of court petition against central home ministry..Center home ministry gave orders which is against Supreme court judgement on Asset sharing..

BJP(gujju gang) chesina mosam UPA kanna darunam AP ki...

 

https://www.deccanchronicle.com/nation/current-affairs/081217/andhra-pradesh-to-file-contempt-plea-against-centre.html

idi kada manaku kaavalsina emotion. kick ante idi. this is what AP people want. AP Govt. should do this for all matters. Appudu CBN mass leader avuthadu definite ga. ~~bob marley. :D

Link to comment
Share on other sites

ఏపి ప్రభుత్వం సంచలనం... దివాలా ప్రక్రియ ప్రరంభించమంటూ పిటీషన్...

   
telangana-20012018-1.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా దూకుడుగా ఉండాలి అనుకున్నారో, చంద్రబాబు ఈ మధ్య అలాగే ఉంటున్నారు... మాది ధనిక రాష్ట్రం, మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి అంటూ డాంబికాలు పోయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మన ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకుని, మనకి బాకీ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు... మానకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్డ్ అప్ ఇస్తూ, బయట తిరుగుతూ, ఫోజులు కొడుతున్న సంగతి తెలిసిందే... దేశంలోనే రిచ్ స్టేట్ అని డబ్బా కొట్టుకుంటూ, మన సొమ్ము ఇప్పటికీ లాక్కుని బ్రతుకుతున్న తెలంగాణా సంస్థ పై దూకుడుగా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

 

telangana 20012018 2

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా, ఒక ప్రభుత్వ సంస్థ, మరొక ప్రభుత్వ సంస్థ నుండి తన బకాయిలను తిరిగి పొందడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వద్దకు వెళ్లి, ఆ సంస్థ పై దివాలా ప్రక్రియ ప్రారంభించి, ఆస్తులు జప్తు చేసి, మా బాకీ మాకు తీర్చేలా చెయ్యండి అంటూ, పిటీషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ... ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ (ఎపి జెనోకో), తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థను ట్రిబ్యునల్ కు లాగడంతో దివాలా ప్రక్రియ ప్రారంభించి, రూ.3,700 కోట్ల రాబట్టాలని చూస్తుంది..

telangana 20012018 3

దివాలా తీర్మానం ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ, 2016 సెక్షన్ 9 ప్రకారం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ముందు ఎపి జెన్కో తన పిటిషన్ దాఖలు చేసింది. మూడున్నర సంవత్సరాల పాటు మన కరెంటు వాడుకుని, 4 వేల కోట్లు బకాయలు పడి, డబ్బులు అడిగితే మన రాష్ట్రానికి ఎగ్గొట్టి, మాది రిచ్ స్టేట్ అంటూ డబ్బా కొట్టుకుంటూ ఊరు ఊరు తిరుగుతున్న కెసిఆర్ కి, కెసిఆర్ కొడుక్కి, ఇప్పటికైనా బుద్ధి వచ్చి, మన డబ్బులు ఇస్తారో, లేక ఆస్తులు జప్తు చేసుకుని, మనకు బాకీ తీరుస్తారో చూద్దాం...

Link to comment
Share on other sites

అవసరమైతే సుప్రీం కోర్ట్ కి వెళ్తాం... మోడీకి ఇదే చెప్పా... కేంద్రం పై మారుతున్న చంద్రబాబు స్వరం...

 
cbn-collectors-conf-19012018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై స్వరం పెంచారు... గుంటూరు జిల్లా ఉండవల్లిలో సియం నివాసం వద్ద జరుగుతున్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కేంద్రం పై సీరియస్ వ్యాఖ్యలే చేసారు... ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రమేయం లేకుండానే విభజన చేశారని, అందరితో మాట్లాడి న్యాయం చేయాలంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

 

cbn collectors conf 19012018 2

విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ చెబుతున్నారని, కాని న్యాయం చెయ్యండి అంటే, మాత్రం ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు... పెద్దన్న పాత్ర పోషించి, ఆదుకోవాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, విభజన హామీల విషయంలో రాజీ లేదు అని, ఎవరితోనైనా పోరాడతామని చంద్రబాబు అనంరు.... విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుంటే, కేంద్రం పై సుప్రీం కోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని అని చంద్రబాబు అన్నారు...

cbn collectors conf 19012018 3

మొన్న ప్రధానిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు... విభజన చట్టంలో ఉన్నవే కోరుతున్నామని, అదనంగా అడగటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో మనం అట్టడుగున ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామర్ధ్యం లేక తలసరి ఆదాయం తగ్గలేదన్నారు... ఇవన్నీ విభజన పాపాలు అని అన్నారు... ఇతర రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ఆదుకోవాల్సిందే అని, అది కేంద్రం బాధ్యత అని తెగేసి చెప్పారు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...