Vulavacharu Posted January 9, 2018 Share Posted January 9, 2018 http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break38 తితిదే ఛైర్మన్గా సుధాకర్యాదవ్! సంక్రాంతి తర్వాత పాలకవర్గ నియామకం ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ ఛైర్మన్గా పుట్టా సుధాకర్యాదవ్ నియామకం దాదాపు ఖరారైంది. పాలక మండలి సభ్యుల నియామకంపైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. భాజపా సూచించిన ముగ్గురు సభ్యులకు పాలకవర్గంలో చోటు లభించనుంది. ఈ మేరకు నియామక ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల క్రితమే నిర్ణయం: కడప జిల్లాకు చెందిన తెదేపా నేత సుధాకర్యాదవ్ను తితిదే ఛైర్మన్గా నియమించాలని మూడు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించినా.. పలు కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. సుధాకర్యాదవ్ క్రైస్తవ కూటమిలో పాల్గొన్నారన్న విమర్శలు రావడంతో.. ప్రభుత్వం పరిశీలన చేపట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధరణకు వచ్చాక తుది నిర్ణయం తీసుకుంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.