Jump to content

YCP leader in 200 CR scam..


KING007

Recommended Posts

యధా నేత తథా అనుచరులు

200 కోట్లు షేవ్ చేసిన వై కా పా "సేవా దళం " నేత సైకం

200 కోట్ల స్కాం లో ప్రతిపక్ష నేత జగన్ అనుచరుడు ప్రకాశం జిల్లా వై కా పా నేత,వై కా పా సేవ దళం నేత 
సై కం రామకృష్ణ రెడ్డి

బిట్‌ కాయిన్‌ పేరుతో టోపీ
దేశవ్యాప్తంగా 28వేల మంది బాధితులు
నిందితుడు రామకృష్ణారెడ్డిది ప్రకాశం
ఢిల్లీ సైబర్‌ వింగ్‌ పోలీసులకు ఫిర్యాదు
ఏపీ, టీఎస్‌ డీజీపీలకూ ఫిర్యాదు : ‘‘ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు మొదలుకొని ఢిల్లీ వరకూ 28 వేల మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి ముఖం చాటేశాడు. దీంతో బాధితులు ఢిల్లీ సైబర్‌ వింగ్‌ పోలీసులతోపాటు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు బిట్‌ కాయిన్‌ పేరుతో వసూళ్లు చేసి బిచాణా ఎత్తేసిన వ్యక్తి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన సైకం రామకృష్ణారెడ్డి అని గుర్తించారు.

కనిగిరి సమీపంలోని బల్లవరం (వెలిగండ్ల మండలం) గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టించారు. అందుకు కమీషన్‌ కూడా తీసుకున్న అతడు డిసెంబర్‌ మొదటి వారంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఆపేశారు. ఏమిటని ఆరా తీయగా మన దేశంలో బిట్‌ కాయిన్‌ ఆర్థిక విధానాలను కేంద్రం అనుమతించడం లేదని, ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోందని కొన్నాళ్లు ఆగాలని చెప్పారు. ఆ తర్వాత ఫోన్‌ నెంబర్లు ఆఫ్‌ చేశాడు. దీంతో నోయిడాకు చెందిన సుమిత్‌ అతని స్నేహితులు మోసపోయామన్న అనుమానంతో ఢిల్లీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న అమీర్‌పేట ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరైన విషయం తెలియడంతో హైదరాబాద్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అంతలోనే అక్కడి నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని బాధితులు అక్కడికి చేరుకున్నారు. కానీ గ్రామంలోని ఆయన అనుచరులు వారిపై ఎదురుదాడికి సిద్ధపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరాది వ్యక్తులు కావడంతో వెనక్కి తగ్గి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓ వైపు సేవ.. మరో వైపు వసూలు..
రామకృష్ణకు ఎన్నో కార్యక్రమాలున్నాయి. ఓ వైపు సేవ పేరుతో ప్రచారం, మరోవైపు ఉద్యోగాల పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి డబ్బు వసూలు చేస్తుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే కొన్నేళ్లుగా చైన్నైలో ఎక్కువగా ఉంటోన్న ఆయన వైఎ్‌సఆర్‌ పార్టీ తమిళనాడు విభాగం సేవాదళ్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16, 17న చెన్నైలో వైసీపీ లీడర్లతో భేటీ అవుతారని, ఆ తర్వాత 19, 20న వైసీపీ అధినేత జగన్‌ పుట్టినరోజు (21) వేడుకల ఏర్పాట్లలో ఉంటాడని బాధితులు పోలీసులకు షెడ్యూల్‌ అందజేశారు. ఈ విషయమై ఏపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరిని అడగ్గా బాధితులు ఢిల్లీలో సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినందున అక్కడే కేసు నమోదుకు అవకాశం ఉందన్నారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు తెలిశాక వెల్లడిస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...