Jump to content

Narasimha Naidu-2 ?


sonykongara

Recommended Posts

నరసింహనాయుడుకు’ సీక్వెల్‌?
81217bala.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘నరసింహనాయుడు’కు సీక్వెల్‌ రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 2001లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. బి.గోపాల్‌ దర్శకత్వం శైలికి, బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

ఇందులో బాలకృష్ణకు జోడీగా సిమ్రన్‌, ప్రీతి జింగ్యాని నటించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చిన్నికృష్ణ కథ సిద్ధం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాలకృష్ణ ప్రస్తుతం ‘జైసింహా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2018 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా దోషి నటిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. దీనికి తేజ దర్శకత్వం వహిస్తారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...