Cyclist Posted November 24, 2017 Share Posted November 24, 2017 చెల్లని చెక్కు కేసులో నిర్మాత బండ్ల గణేష్కు జైలు శిక్ష పడింది. ‘టెంపర్’ సినిమాకు సంబంధించి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వాసు ఫిర్యాదు చేయగా, శుక్రవారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి.. బండ్ల గణేష్కు ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు, రూ.15.86లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నటుడిగా కెరీర్ను ప్రారంభించిన బండ్ల గణేష్ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ‘గబ్బర్సింగ్’, ‘బాద్షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.