Jump to content

ఐటీకి షాక్‌.. 10వేల కోట్ల పన్నుకు నోటీసులు..


KING007

Recommended Posts

ఐటీకి షాక్‌.. 10వేల కోట్ల పన్నుకు నోటీసులు 
23brk-it-industry-dk1.jpg

ముంబయి: ఐటీ పరిశ్రమలో ప్రకంపనలు! కంపెనీలకు పన్నుల శాఖ వణుకు పుట్టిస్తోంది. దేశంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలు పదివేల కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాలని పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రక్షణాత్మక ఆర్థిక విధానాలతో చిన్న కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 200 సంస్థలు సేవా పన్ను చెల్లించాలని నోటీసులు రావడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.

ఎగుమతుల కిందకు రావు! 
ఐదేళ్ల కాలంలో (2012-2016) విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేసి పొందిన ప్రజయోనాల రిటర్న్స్‌ దాఖలు చేయాలని సేవా పన్నుల శాఖ ఐటీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆలస్యం చేసినందుకు వడ్డీ, జరిమానాలతో పాటు అదనంగా 15 శాతం సేవా పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. భారత్‌కు వెలుపల వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ను అందించడం ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలకు ఎగుమతి చేసినట్టు కాదు. ఎందుకంటే.. క్లైంటు ప్రత్యేకమైన వివరాలతో భారత ఐటీ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి చేయాలో ముందే మెయిల్‌ పంపిస్తారు. అయితే ఇది అందుబాటులో ఉన్న వస్తువులను విదేశీ వినియోగదారుకు విక్రయిస్తున్నట్టే అని పన్నుల శాఖ వాదిస్తోంది.

23brk-it-industry-dk2.jpg

రెండు రకాలుగా దెబ్బ 
కంపెనీలు ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లినా ఫలితం ఉండదని నిపుణులు అంటున్నారు. అక్కడికి వెళ్లాలన్నా ముందు ఆ మొత్తంలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ దెబ్బతో ఏం చేయాలో పాలుపోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ పన్ను గతంలో 15 శాతమే ఉంటే.. జీఎస్‌టీ రాకతో ఇప్పుడది 18 శాతానికి పెరగడంపై సంస్థలు లబోదిబోమంటున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...