paruchuriphani Posted November 16, 2017 Share Posted November 16, 2017 న్యూఢిల్లీ, నవంబరు 15: ఐఎస్ ఉగ్రవాదులు భారత్లో మారణహోమం సృష్టించబోతున్నారా? యూరప్ తదితర దేశాల్లో భారీ వాహనాలను జనాలమీదకు పోనిచ్చినట్లుగా నరమేధానికి ప్లాన్ వేసుకున్నారా? ముఖ్యంగా హిందూ పండగలే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ విడుదల చేసిన ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ‘హిందువులు తినే ఆహారంలో, తాగే నీళ్లలో విషం కలపండి. త్రిస్సూర్ పూరమ్, మహా కుంభమేళ జరిగే ప్రాంతాల్లో జనాలపైకి భారీ వాహనాలను నడపండి’ అంటూ ఐఎస్ సానుభూతిపరులకు రషీద్ పిలుపు ఇచ్చాడు. పదినిమిషాల ఆ ఆడియో టేప్ మలయాళంలో ఉంది. భారత్కు చెందిన రషీద్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఆఫ్ఘన్ కేంద్రంగా ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఒక్కో ఉగ్రవాది ‘ఒంటరి తోడేళ్ల’ మాదిరి హిందువులపై విరుచుకుపడాలని పిలుపిచ్చాడు. ‘మన మద్దతుదారుడు లాస్వెగాస్ మ్యూజిక్ కన్సర్ట్కు వచ్చిన అనేక మందిని చంపేశాడు. మీరు కూడా ప్రయత్నించండి. రైళ్లను పట్టాలు తప్పించండి లేదా ఒక కత్తి అయినా ఉపయోగించండి’ అని రషీద్ పేర్కొన్నాడు. ‘మీలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు. కాఫిర్లను చంపడానికి మీ తెలివితేటలు ఉపయోగించండి. చంపేయండి వారిని. ప్రజాస్వామ్యాన్ని, హిందూయిజాన్ని, క్రైస్తవాన్ని నాశనం చేయండి. అల్లా ఆదేశాలతో రాజ్య పాలన చేయండి’ అని ఆడియో టేప్లో పేర్కొన్నాడు రషీద్. ‘ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేయలేకపోతే ఐఎస్ కు ఆర్థికంగా సాయపడండి’ అని కూడా పిలుపిచ్చాడు. ఆఫ్ఘన్లోని టెలిమెసెంజర్ అలాగే ఇన్స్టాంట్ చాట్ అప్లికేషన్స్ ద్వారా ఆడియో క్లిప్ ప్రచారం అవుతున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. రషీద్పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కేరళ పోలీసులు కూడా రషీద్ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
paruchuriphani Posted November 16, 2017 Author Share Posted November 16, 2017 ఇలాంటి వాటికీ మన దేశం లో ఆపర మేధావులం అని చెప్పుకొనే వాళ్దు & మేము అంతా లౌకిక వాదులం అని చెప్పుకొనే వాళ్దు ఏమి చెప్తారో ..... మన కర్మ కొద్దీ ఇలాంటివి జరిగితే ఇదంతా గవర్నమెంట్ వైఫల్యం...ISIS వాళ్దు ఏమి తప్పు లేదు. వాళ్దు వల్ద భావాలను & వాళ్దు అసహనాని ఇలా వ్యక్తం చేసారు. తప్పు అంతా ప్రభుత్వానిదే అంటారు ఏమో.... లౌకిక వాద ప్రభుత్వాలే పరిపాలిస్తున్న కేరళ & బెంగాల్ లో మాత్రమే ఇలాంటి ఎందుకు జారుతున్నాయి ..... దేశం లోని ఆపర మేధావులు ఏమో కేరళ , బెంగాల్ & కర్ణాటక లో మాత్రమే ప్రభుత్వాలు వున్నాయి ...మిగతా దేశం మొత్తం అసహనం తో రగిలి పోతుంది అన్నారు. అంటే దేశం మొతం ఇలాంటి టెర్రరిస్ట్ లతో నిండిపోతే అప్పుడు మనది లౌకిక వాద దేశం అయినట్లా.... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.