KING007 Posted November 15, 2017 Share Posted November 15, 2017 యూఎస్లో లక్ష ఉద్యోగాలు సృష్టించిన భారత్ వాషింగ్టన్: అమెరికాలో భారతీయ కంపెనీలు భారీస్థాయిలో ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. భారత్కు చెందిన సుమారు 100 కంపెనీలు అమెరికాలో ఏడాదికి 18బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతుండగా.. 1,13,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ‘ఇండియన్ రూట్స్.. అమెరికన్ సాయిల్’ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. భారత్ యూఎస్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 147 మిలియన్ డాలర్లు, పరిశోధన, అభివృద్ధి కింద 588 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. భారత్కు చెందిన దాదాపు 100 కంపెనీలు 50 రాష్ట్రాల్లో 1,13,423 మంది ఉద్యోగాలు కల్పించాయి. న్యూజెర్సీ(8,572), టెక్సాస్(7,271), కాలిఫోర్నియా(6,749), న్యూయార్క్(5,135), జార్జియా(4,554) ప్రాంతాల్లో అత్యధికంగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో భారత్ భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టినట్లు సీఐఐ నివేదిక చెబుతోంది. న్యూయార్క్(1.57 బిలియన్ డాలర్లు), న్యూజెర్సీ(1.56బిలియన్ డాలర్లు), మసాచుసెట్స్(931 మిలియన్ డాలర్లు), కాలిఫోర్నియా(542 మిలియన్ డాలర్లు), ఓమింగ్(435 మిలియన్ డాలర్లు)లలో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అమెరికాలోని రాష్ట్రాల్లో భారత కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు సగటున 187 మిలియన్ డాలర్లు ఉంటుంది. రానున్న ఐదేళ్లలో 87శాతం కంపెనీలు స్థానికంగా ఉన్న తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని యోచిస్తున్నాయి. దీనిపై అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నా మాట్లాడుతూ.. భారత నిపుణులు, పరిశ్రమలు యూఎస్ ఆర్థికవ్యవస్థకు ఎంతగానో దోహదపడుతున్నాయని వివరించారు. ఇరు దేశాల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ పేర్కొన్నారు. అమెరికాలోని భారత కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, అదేవిధంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థకు సహాయ పడుతున్నాయని సెనెటర్ క్రిస్ వాన్ హోలెన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్-యూఎస్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని కాంగ్రెస్ సభ్యుడు పెటె సెషన్స్ పేర్కొన్నారు. ఇప్పటికే భారత్లో అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ తలుపులు తెరిచారన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయనేందుకు తాజాగా విడుదలైన సీఐఐ నివేదికే నిదర్శనమని సెనెటేర్ సెషన్స్ హర్షం వ్యక్తం చేశారు. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted November 15, 2017 Author Share Posted November 15, 2017 india lo peeki, US lo isthunnaru.... Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted November 15, 2017 Share Posted November 15, 2017 Twaralone bayata desallo fraud chestaaru.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.