Jump to content

వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు


koushik_k

Recommended Posts

  • బండారు దత్తాత్రేయ
ఖమ్మం అర్బన్‌, నవంబరు 12: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఖమ్మంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తో పాటు ఏ ఇతర పార్టీలతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు. అన్ని స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ బలం గత రెండేళ్లలో ఎంతగానో పెరిగిందన్నారు.
 
 
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పెద్ద నోట్ల రద్దును 82 శాతం మంది స్వాగతించారన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదం, అవినీతి, నల్లడబ్బుకు ఒకేసారి చెక్‌ పెట్టినట్టయిందని చెప్పారు. బీజేపీ శ్రేణులు కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ, ఏపీలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని, సర్వేకు ఆదేశించిందని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...