Jump to content

2018 December state and union elections


NatuGadu

Recommended Posts

ఏకకాలంలో ఎన్నికలకు సిద్ధమే: ఈసీ 

5brk-election.jpg

భోపాల్‌: వచ్చే ఏడాది సెప్టెంబర్‌ తర్వాత నుంచి ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రూ. వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌వో) నెట్‌వర్క్‌ వెబ్‌ యాప్‌ను రావత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు.

‘దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏం కావాలో మేం ప్రభుత్వానికి వివరించాం. ఈవీఎంలు తదితర అంశాల గురించి చర్చించాం. అంతేగాక ఇందుకు ఎంత డబ్బు అవసరమో కూడా చెప్పాం. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 40లక్షల ఎన్నికల సంబంధిత పరికరాలు కావాలి. వీవీపాట్‌(వోటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)ల కోసం రూ.3,400కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుంది.’ అని రావత్‌ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అందించడంతో అదనపు పరికరాల కోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు రావత్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 2018 నాటికి అన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సన్నద్ధంగా ఉంటామని తెలిపారు.

ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో ప్రధాని మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దీనివల్ల కోట్లాది రూపాయలు ఆదా అవడమేగాక, ఎంతో సమయం కలిసివస్తుందని ఆయన అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...