Jump to content

NIT


Recommended Posts

ఏపీ నిట్‌కు 50 కోట్లు మంజూరు
తాడేపల్లిగూడెం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌) శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. దీంతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి తొలి అడుగు పడింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అవసరమైన భవనాల ఏర్పాటుకు ఆశలు చిగురించాయి. భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసేందుకు మార్గం ఏర్పడింది. నిధులు మంజూరవడంతో ఇక ఏపీ నిట్‌ అధికారులు తొలుత సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో భాగమైన ఆర్కిటెక్ట్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. గతంలో ఆమోదించిన డిజైన్‌లపై చర్చిస్తారు. అనంతరం భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టే సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌తో సమావేశమై బాధ్యతలు అప్పగించనున్నారు. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ టెండర్లను పిలిచి, ఏజెన్సీలను ఖరారు చేశాక, భవన నిర్మాణానికి పునాదిరాయి పడుతుంది. త్వరలోనే ఆర్కిటెక్ట్‌ విభాగ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నామని ఏపీ నిట్‌ రెసిడెంట్‌ కో-ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. తొలుత విద్యార్థులకు హాస్టల్‌ వసతి, తరగతి గదులు నిర్మిస్తారు. నాలుగైదు అంతస్తుల భవనాలనే శాశ్వత క్యాంప్‌సలో నిర్మించనున్నారు. ఏపీ నిట్‌లో నిర్వహిస్తున్న ఎనిమిది ఇంజనీరింగ్‌ కోర్సులకు సంబంధించిన తరగతి గదులన్నీ ఒకేచోట నిర్మిస్తారు. ప్రస్తుతం 2,300 మంది విద్యార్థులకు సరిపడా క్యాంప్‌సను నిర్మిస్తున్నారు. మొత్తం రూ.460 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో ఈ ఏడాది రూ.206 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం రూ.50 కోట్లు విడుదల చేసింది. మరో రూ.50 కోట్లు త్వరలో వస్తాయని భావిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...