Jump to content

మంచితనం ఇంకా మిగిలె ఉంది.


LuvNTR

Recommended Posts

బాంబు భుజాన పెట్టుకొని పరిగెత్తాడు 

27brk-bombpolice.jpg

 

భోపాల్‌: పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడాలనే తపనతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ సిద్ధపడ్డాడు. పది కేజీల బరువు ఉండే బాంబును భుజాన పెట్టుకొని కిలోమీటరు దూరం పరిగెత్తాడు.

 

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్‌ అభిషేక్‌ పటేల్‌కు పాఠశాలలో పెట్టిన 12 అంగుళాల బాంబు కంటపడింది. అప్పటికీ బాంబు నిర్వీర్య బృందం పాఠశాలకు రాలేదు. దాంతో పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు పటేల్‌ పది కేజీల బరువు ఉన్న బాంబును భుజాన పెట్టుకొని నిర్జన ప్రదేశంలో పారేయడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో పాఠశాలలో 400 మంది చిన్నారులు ఉన్నారు. కిలోమీటరు దూరం పాటు ఆ బాంబును అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ ఆ బాంబు పటేల్‌ చేతిలో ఉన్నప్పుడు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు పాఠశాలలో ఎవరు బాంబు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన పటేల్‌ను సహోద్యోగులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐజీ రివార్డు ప్రకటించారు.

 

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break114

Link to comment
Share on other sites

బాంబు భుజాన పెట్టుకొని పరిగెత్తాడు 

27brk-bombpolice.jpg

 

భోపాల్‌: పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడాలనే తపనతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ సిద్ధపడ్డాడు. పది కేజీల బరువు ఉండే బాంబును భుజాన పెట్టుకొని కిలోమీటరు దూరం పరిగెత్తాడు.

 

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్‌ అభిషేక్‌ పటేల్‌కు పాఠశాలలో పెట్టిన 12 అంగుళాల బాంబు కంటపడింది. అప్పటికీ బాంబు నిర్వీర్య బృందం పాఠశాలకు రాలేదు. దాంతో పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు పటేల్‌ పది కేజీల బరువు ఉన్న బాంబును భుజాన పెట్టుకొని నిర్జన ప్రదేశంలో పారేయడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో పాఠశాలలో 400 మంది చిన్నారులు ఉన్నారు. కిలోమీటరు దూరం పాటు ఆ బాంబును అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ ఆ బాంబు పటేల్‌ చేతిలో ఉన్నప్పుడు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు పాఠశాలలో ఎవరు బాంబు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన పటేల్‌ను సహోద్యోగులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐజీ రివార్డు ప్రకటించారు.

 

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break114

:adore:
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...