Jump to content

beeda masthan rao ttd chairman?


Jack

Recommended Posts

Times of Nellore ( Nellore ) – గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మైన్ పోస్టును ఎట్టకేలకు భర్తీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం పూర్తయిన నేపద్యంలో, ఛైర్మైన్ పోస్టుకు చాలా మంది ప్రముఖులు పోటీ పడ్డారు. పోటీ అధికం కావడంతో ఛైర్మైన్ నియామకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నెల్లూరుజిల్లాకు చెందిన బిసి సామాజిక వర్గం నాయకులు బీదా మస్తాన్ రావును ఛైర్మైన్ పోస్టులో కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో దానికి సంభందించిన ఉత్తర్వులను జారీ చేయనుంది ప్రభుత్వం. టిటిడి ఛైర్మైన్ పోస్టుకు మొదట్లో రాయపాటి సాంబశివరావు ఆశించారు. అలాగే సినీనటుడు, ఎమ్.పి. మురళీమోహన్ నేరుగా చంద్రబాబుతో భేటీ అయ్యి తనకు టిటిడి ఛైర్మైన్ గా అవకాశం కల్పించాలని మనసులో కోరికను బయటపెట్టారు.

 

అయితే పదవుల్లో ఉన్న వారికి ఛైర్మైన్ పోస్టును ఇచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే రాయపాటి సాంబశివరావుకు కూడా నిరాకరించారు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పేరు, రిటైర్డ్ ఐఏఎస్ ఐ.లక్ష్మీనారాయణ పేర్లు కూడా పరిశీలను వచ్చాయి. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణకు ఛైర్మైన్ గిరీని అప్పగించాలని చర్చ జరిగింది. చంద్రబాబు కూడా ఆ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. ఐతే 2019లో జరిగే ఎన్నికల్లో ఎక్కడో ఓ చోట నుండి పోటీ చేయాలని భావిస్తున్న హరికృష్ణ ఛైర్మైన్ రేసు నుండి తప్పుకున్నారు. చివరకు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని, అది కూడా వారు పార్టీకి విధేయులుగా ఉండే వారికే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపద్యంలో బీసీల్లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన, నెల్లూరుజిల్లా నేత బీదా మస్తాన్ రావు పేరును పరిశీలించారు. దానికి పార్టీలోని ముఖ్య నేతలంతా ఓకే చెప్పడంతో ఆయనకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆయన నియామకానికి సంభందించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. బీదా మస్తాన్ రావు సోదరులు బీదా రవిచంద్ర శాసనమండలి సభ్యునిగా, నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...