Jump to content

NTR Housing Scheme


Recommended Posts

రానున్న సంక్రాంతి నాటికి పేదల సొంతింటి కల సాకారం కానుందని జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఏపీటిడ్కో-చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‌పూనేపల్లె వద్ద ఎన్టీఆర్‌ నగర్‌లో నిర్మిస్తోన్న అపార్ట్‌మెంట్లలో పేదలకు ఫ్లాట్లను మంజూరు చేశారు.

https://pbs.twimg.com/media/DsghQE1VAAAUKOx.jpg

Link to comment
Share on other sites

నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు 
రూ.6,649 కోట్లతో 4 లక్షల గృహాలు 
గృహనిర్మాణ శాఖ సమీక్షలో సీఎం

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రెండు వేలకు తగ్గకుండా ఇళ్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.6,649 కోట్ల వ్యయంతో 4 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం రాత్రి గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి గృహనిర్మాణ పథకాన్ని ప్రకటించక ముందు ప్రజాప్రతినిధుల హామీతో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన 1.26 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.70వేలు చొప్పున ఇవ్వాలని ప్రాథమికంగా  నిర్ణయించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేయనున్నారు. హడ్కో నుంచి రూ.5 వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని  అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 9 గృహనిర్మాణ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నిర్మించే గృహ సముదాయాలకు నరేగా నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పదివేలకు పైగా జనాభా ఉన్న మండల కేంద్రాలు, పంచాయతీల్లో జీ ప్లస్‌ త్రీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. 2018-19లో వివిధ పథకాల కింద మొత్తం 5.46 లక్షల ఇళ్లు కేటాయించగా వాటిలో 2.50 లక్షల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉందని, త్వరలో అవినీతి లేని రాష్ట్రంగా అవతరించనుందని పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖలో పదోన్నతులు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించేంతవరకూ గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు విశ్రమించొద్దన్నారు. ఇప్పటివరకూ 19 లక్షల ఇళ్లు మంజూరు చేయగా...అందులో 7,20,104 ఇళ్లు పూర్తి చేసి, రికార్డు సృష్టించామన్నారు. మిగతా వాటిని ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. 2018 సంవత్సరానికి గాను ఏపీ గృహనిర్మాణ శాఖ  15 స్కోచ్‌ అవార్డులు దక్కించుకుందన్నారు. ఈ ఘనత సాధించినందుకు వారిని అభినందించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...