Jump to content

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు


Ramesh39

Recommended Posts

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు హైదరాబాద్‌: సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 21వ వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ కుమార్తె, నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి, వారి కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ తదితరులు ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు.


ఎన్టీఆర్‌ లాంటి మహానుభావుడిని తెలుగుజాతి తరతరాలు గుర్తుచేసుకుంటూనే ఉంటుదని హరికృష్ణ అన్నారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన ఆశల సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు.


రసూల్‌పురాలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రసూల్‌పురా నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్‌ ఎంతో శ్రమించారని అన్నారు.బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 


 



Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...