Jump to content

Vijayawada Outer Ring Road


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
కృష్ణానదిపై ఆరులైన్ల ఐకానిక్‌ బిడ్జి!!
 
636185034281919248.jpg
  • విజయవాడ బైపాస్‌ కూడా ఆరు లైన్లు 
  • విజయవాడ - గుండుగొలను అవుటర్‌లో మార్పులు 
  • తాజాగా.. ఆరులైన్ల కోసం సీఎం చంద్రబాబు, 
  • ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు 
  • నితిన్‌ గడ్కరీతో తరచూ సంప్రదింపులు 
  • మంగళవారం కీలక సమావేశంలో ఆమోదం
కృష్ణానదిపై ఆరులేన్ల ఐకానిక్‌ బ్రిడ్జికి లైన్‌క్లియర్‌ అయింది. ఎన్‌హెచ్‌ - 16 విస్తరణలో భాగంగా విజయవాడ నుంచి గుండుగొలను వరకు కేంద్రం ఆరులేన్ల రహదారి విస్తరణలో భాగంగా విజయవాడ బైపాస్‌తో పాటు అంతర్భాగంగా ఉన్న కృష్ణానదిపై బ్రిడ్జిను కూడా ఆరులేన్లుగా నిర్మించేందుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మంగళవారం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, విజయవాడ)
కృష్ణానదిపై ఆరులేన్ల ఐకానిక్‌ బ్రిడ్జికి లైన్‌క్లియర్‌ అయింది. ఎన్‌హెచ్‌ - 16 విస్తరణలో భాగంగా విజయవాడ నుంచి గుండుగొలను వరకు కేంద్రం ఆరులైన్ల్ల రహదారి విస్తరణలో భాగంగా విజయవాడ బైపాస్‌తో పాటు అంతర్భాగంగా ఉన్న కృష్ణానదిపై బ్రిడ్జిను కూడా ఆరులైన్లుగా నిర్మించేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటివరకు విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణాలకు నాలుగులైన్లకు మాత్రమే అనుమతి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని చెంతనే ఏర్పడిన నేపథ్యంలో, నాలుగు లైన్ల్ల స్థానంలో ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలని ఎప్పటినుంచో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, కేంద్ర మంత్రి గడ్కరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ బైపాస్‌ను నాలుగు లైన్లుగా మాత్రమే నిర్మించటానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బీఓటీ పద్ధతిలో గామన్‌ ఇండియా కాంట్రాక్టును దక్కించుకుంది.

అప్పటినుంచి ఈ సంస్థ పనులు ప్రారంభించకుండా తాత్సారం చేయటంతో ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఒకానొక దశలో కాంట్రాక్టు సంస్థను రద్దు చేసే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిచింది. రెండేళ్ళుగా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దటం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్‌ను నిర్మించారు. అసెంబ్లీ భవన్‌ పనులు కూడా అక్కడే జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన 33 వేల ఎకరాలను విభజించి 9 నగరాలు, 29 ఉప నగరాలుగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలను సిద్ధం చేసుకుంది. రాజధానిని అటు గుంటూరు, ఇటు విజయవాడలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా అనుసంధానం చేయటానికి భారీ ఎత్తున అవుటర్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్లకు టెండర్లు పిలవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు కూడా అనుసంధానం చేయటానికి వీలుగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు తగిన ప్రణాళికలతో ఉంది. రాజధానిలో అంతర్గతంగా మెగా ఆరు, ఎనిమిది లేన్ల నిర్మాణానికి ఇప్పటికే కొన్నింటికి టెండర్లు పిలిచారు. విజయవాడ విమానాశ్రయాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దాదాపుగా 700 ఎకరాలలో రన్‌వే, నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని మెట్రోనగరాలలో ఉన్న ఎయిర్‌పోర్టులు కూడా సాధించలేని వృద్ధిరేటును విజయవాడ ఎయిర్‌పోర్టు సాధించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌, ఇతర రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల నుంచి బారీ సంఖ్యలో వలసలు. రద్దీ పెరగటంతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు జరుగుతున్నాయి. ఎన్‌హెచ్‌ - 16 కూడా విజయవాడ మీదుగానే వెళుతుంది. విజయవాడలో ట్రాఫిక్‌ ఇబ్బందులను తప్పించటంతో పాటు కృష్ణానది మీదుగా గుంటూరుకు అనుసంధానం చేయటానికి విజయవాడ - గుండుగొలను అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 114 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ అవుటర్‌ రింగ్‌ రోడ్డులో విజయవాడ నుంచి పెద అవుటపల్లి వరకు 48 కిలోమీటర్ల మేర విజయవాడ బైపాస్‌, తిరిగి హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు జంక్షన్‌ బైపాస్‌లను నాలుగు లేన్లుగా అప్పట్లో ప్రతిపాదించారు. పెద అవుటపల్లి నుంచి ప్రారంభమయ్యే విజయవాడ బైపాస్‌తోపాటుగా కృష్ణానదిపై వంతెనను కూడా నాలుగు లేన్లు సరిపోతాయని అప్పట్లో ఎన్‌హెచ్‌ ఫీజుబిలిటీ రిపోర్టును ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం రాజధాని పరిపాలన సాగుతున్న ప్రాంతం విజయవాడ నుంచి 20 కి.మీటర్ల దూరం ఉంటుందని నాని లేఖలో పేర్కొన్నారు. రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని భవిష్యత్తు అవసరాలకు నాలుగు లేన్ల బైపాస్‌ సరిపోదని ఆయన అందులో పేర్కొన్నారు. గుంటూరువైపు నుంచి గన్నవరంలోని విజయవాడ విమానాశ్రయానికి ట్రాఫిక్‌ పెరుగుతోందని ఎంపీ తన లేఖలో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కృష్ణానదిపై నాలుగు లేన్ల బ్రిడ్జి స్థానంలో ఆరు లేన్ల ఐకానిక్‌ బ్రిడ్జిగా నిర్మిస్తే... ఇందులో కొంత వ్యయం రాష్ట్ర ప్రభుత్వం కూడా భరిస్తుందని ఇచ్చిన హామీని ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విజయవాడ బైపాస్‌ను రెండువైపులా సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లతో సహా ఆరులేన్లుగా నిర్మించాలని కోరారు. అలాగే కృష్ణానదిపై ఆరులేన్ల వంతెనను నిర్మించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రంలో గతంలో అనేక మార్లు చర్చించింది.

మంగళవారం సాయంత్రం ఢిల్లీలో దీనిపై జరిగిన తుది సమావేశంలో ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ మల్లిక్‌, సంబంధిత అధికారులతో చర్చించి ఆరులేన్ల నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలను వెంటనే రూపొందించాలని ఆయన ఎన్‌హెచ్‌ అధికారులను ఆదేశించారు. జాతీయ ర హదారి విస్తరణ కోసం జరిపిన భూ సేకరణలో తీసుకున్న భూమి ఆరులేన్లతో పాటు సర్వీసు రోడ్లకు కూడా సరిపడేలా ఉన్నందున భూములకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు కూడా వివరించారు. దీంతో ఆరులైన్ల్ల ఐకాన్‌ బ్రిడ్జి, విజయవాడ బైపాస్‌లకు లైన్‌ క్లియర్‌ చేశారు.
Link to comment
Share on other sites

విజయవాడ- గుంటూరు మెగా ఆరులేన్ల బ్రిడ్జి
 
636184900067581219.jpg
  • కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం
విజయవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన విజయవాడ, గుంటూరు నగరాలను కలిపేందుకు కృష్ణానదిపై మరో భారీ వంతెన నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. విజయవాడ - గుండుగొలను ఔటర్‌ రింగ్‌ నిర్మాణంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పెదఅవుటపల్లి నుంచి గుంటుపల్లి వరకు నాలుగులేన్ల బైపాస్‌ నిర్మాణాన్ని, అక్కడి నుంచి కృష్ణానది మీదుగా నాలుగులేన్ల వంతెన నిర్మించడానికి గామన్‌ ఇండియా బీఓటీ విధానంలో కాంట్రాక్టు దక్కించుకుంది. అప్పటి నుంచి ఈ సంస్థ పనులు చేపట్టలేదు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం అమరావతిని రాజధానిగా చేయడంతో విజయవాడ, గుంటూరుల మధ్య ట్రాఫిక్‌ విపరీతంగా పెరగటం, విమానాశ్రయానికి రద్దీ పెరగటంతో విజయవాడ బైపా్‌సతో పాటు కృష్ణానదిపై నిర్మించనున్న నాలుగు లేన్ల బ్రిడ్జిని ఆరు వరసలుగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి గతంలో విజ్ఞప్తి చేశారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) పలుమార్లు కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖలు రాశారు. దీనిపై మంగళవారం ఢిల్లీలో నితిన్‌ గడ్కరీ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ మల్లిక్‌, ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు. అనంతరం కేంద్రమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరిస్తూ నిర్మాణ ఖర్చు పెరుగుతున్నందున దీనికి అనుగుణమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారని ఎంపీ కేశినేని నాని చెప్పారు. త్వరలోనే గామన్‌ ఇండియా ఈ వంతెన, బైపాస్‌ నిర్మాణ పనులను చేపడుతుందని వివరించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

vijouter_2.jpg

ee line last 4 years lo start chesi apestunnaru..inka aa gamo vaidki time ivvadam enti?vijayawada to eluru gundagolanu varaku worst traffic..akkada nunvhi deviate vautadi traffic...ikkadai daaka extension cheyyali ani decide aina inka full ga work jaragadam ledu..endo ee edavalu inka vallaki time ivvadam endi

Link to comment
Share on other sites

ee line last 4 years lo start chesi apestunnaru..inka aa gamo vaidki time ivvadam enti?vijayawada to eluru gundagolanu varaku worst traffic..akkada nunvhi deviate vautadi traffic...ikkadai daaka extension cheyyali ani decide aina inka full ga work jaragadam ledu..endo ee edavalu inka vallaki time ivvadam endi

Thupuk

Link to comment
Share on other sites

ee line last 4 years lo start chesi apestunnaru..inka aa gamo vaidki time ivvadam enti?vijayawada to eluru gundagolanu varaku worst traffic..akkada nunvhi deviate vautadi traffic...ikkadai daaka extension cheyyali ani decide aina inka full ga work jaragadam ledu..endo ee edavalu inka vallaki time ivvadam endi

shhhh,ayina kuda cbn de tappu,modi is great modi ki corrupotion ante ento telidu,spell cheyadam kuda radu,

 

BJP corruption asalu cheyyadu antaru, mari idi enti?

Link to comment
Share on other sites

  • 1 month later...

 

dini lona edi vacchedi ? ఐకానిక్‌ వంతెనపై కూచిపూడి ‘ముద్ర’

Paidi normal bridge with kuchipudi mudra

Second di double decker bridge

Ippudu redu kalipi kuchipudi mudra lo double decker bridge kosam design preparing

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Road plan maripoyindhi ani pracharam chesaru.. CRDA plan lo vunatte Road vestharu annaru.. Latest ga telisina news enti ante.. NHAI plan maraledhu ani.. Ee road complete chesina Capital city lo nunchi velthundhi. SO Heavy vehicles enter avutai.. like NH road in Vijayawada :sleep:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...