Jump to content

Adani sole bidder for Bhavanapadu port


AnnaGaru

Recommended Posts

VISAKHAPATNAM: The Adani Group is inching closer towards establishing its presence in the port sector in Andhra Pradesh by being the lone company to submit financial bids for developing the minor Bhavanapadu port in Srikakulam district.
According to senior officials of the ports department, of the three firms which had earlier submitted technical bids for developing the port, Gangavaram Port and Krishnapatnam Port backed out of the project leaving only the Adani group to submitt he financial bids.

 

A senior ports department official said, "We have received one bid only for the project, which is from the Adani Group. Now, an evaluation committee will review the bid submitted by the Adani Group and decide on whether to go ahead with them as the developer for the project or not."

 

Confirming the development, a senior AP government official said, "Yes, we have received the bid from the Adani Group. The government will take a decision after evaluating the proposal submitted by the company." The official said the decision would be taken based on the revenue share that has been offered to the state government in the proposal.
According to documents submitted by the state government to the ministry of environment and forests for obtaining environment clearance, the proposed Bhavanapadu Port is expected to have a total capacity of 30.57 million tonnes. The total berths proposed is 14 with five berths in the first phase and the remaining nine berths in the second phase.

 

 

The state government intends to develop Bhavanapadu port with the support of a private developer to handle all types of cargo such as bulk, break bulk, container and liquid materials. The Bhavanapadu port site was selected also due to its proximity to mineral rich states of Chhattisgarh, Jharkhand, Madhya Pradesh and southern Odisha. The estimated cost of the project is Rs 3,725 crore apart from Rs 650 crore estimated for land acquisition.

 

According to the pre-feasibility study by Incap (Infrastructure Corporation of AP), the project of developing a modern port near 

Bhavanapdu is technically and economically viable even under the worst cases of risk analysis.
 

E Adani gadu kosam anna adi mundu veltundi ayete

 

Link to comment
Share on other sites

Just formalities left.

 

Uttarandhra(above Vizag) ki one major international airport,logistics hub, 1 major port on the way

 

Maro Krishnapatnam kanna contribution from our leader.

Just like Krishnapatnam he started from ground for port.

 

This one is better than Krsihnapatnam as we also have AIRPORT&logistics hub parallel.

 

 

http://www.business-standard.com/article/companies/adani-group-likely-to-win-bhavanapadu-port-project-in-andhra-pradesh-116101400878_1.html

Link to comment
Share on other sites

అదానీకే భావనపాడు ఓడరేవు!
 
  • రెండు రోజుల్లో రక్షణ శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ 
హైదరాబాద్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా భావనపాడులో నిర్మించదలచిన ఓడరేవు టెండర్‌ను ప్రముఖ నౌకా నిర్మాణ, యాజమాన్య సంస్థ అదానీ గ్రూప్‌ దక్కించుకునే అవకాశాలున్నాయి. ఈ నెల 3వ తేదీతో ఫైనాన్షియల్‌ బిడ్ల దాఖలుకు గడువు ముగియడంతో... అదానీ గ్రూప్‌ మాత్రమే నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ బిడ్లలో గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల యాజమాన్యాలు కూడా పాల్గొంటాయని భావించారు. భావనపాడు ఓడరేవు నిర్మాణం కోసం ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ నిర్వహించిన సమావేశానికి ఈ రెండు సంస్థలు కూడా హాజరయ్యాయి. కానీ, ఫైనల్‌ బిడ్ల సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో, అదానీ గ్రూప్‌ ఒక్కటే రేసులో ఉన్నట్లు అయింది. ఈ సంస్థ ఎంతకు బిడ్‌ దాఖలు చేసిందో, ఆర్థిక వాటా ప్రతిపాదనలు ఎంత వరకూ ఇచ్చిందన్న వివరాలు ఈ బిడ్‌ను తెరిస్తే తప్ప తెలియవు. ఈ బిడ్‌ను తెరవాలంటే కొత్త ఓడరేవుల నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తప్పని సరి. ఈ అనుమతులు వచ్చేంత వరకూ సాంకేతిక, ఆర్థిక బిడ్లను తెరచేందుకు నిబంధనలు అంగీకరించవు. దీంతో, రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఇన్‌క్యాప్‌) వీటిని తెరవకుండా ఉంచేసింది. కాగా, ఇప్పటికే రక్షణ శాఖ కార్యదర్శితో మాట్లాడిన ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌... శుక్రవారం మరోసారి మాట్లాడారు. భావనపాడు ఓడరేవుకు తాము రెండు రోజుల్లో అనుమతులు ఇస్తామంటూ రక్షణ శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

Just formalities left.

 

Uttarandhra(above Vizag) ki one major international airport,logistics hub, 1 major port on the way

 

Maro Krishnapatnam kanna contribution from our leader.

Just like Krishnapatnam he started from ground for port.

 

This one is better than Krsihnapatnam as we also have AIRPORT&logistics hub parallel.

 

 

http://www.business-standard.com/article/companies/adani-group-likely-to-win-bhavanapadu-port-project-in-andhra-pradesh-116101400878_1.html

 

Uttarandhra very poor... Uttarandhra lo vunna Vizag richest in AP. Vizag developed but didn't allow other places in the region to develop. this time Airport Vijayanagaram lo,  Bhavanapadu port Srikakulam lo ravatam good for uttarandhra. rivers linking kuda chestunnaru ee region lo.

Link to comment
Share on other sites

  • 1 month later...

వేగంగా భావనపాడు పోర్టు భూసేకరణ
భావనపాడు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే భూసేకరణ నిబంధనల్ని సరళీకృతం చేసైనా ఈ ప్రక్రియను త్వరగా కొలిక్కి తేవాలన్నారు. రాష్ట్రంలోని పోర్టుల వాణిజ్యంలో వృద్ధి జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. గడచిన ఏడు నెలల్లో కేవలం 4.1 శాతం వృద్ధి నమోదు చేయడంపై ఆయన పెదవి విరిచారు. పోర్టుల వాణిజ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌, రాష్ట్ర ఫైబర్‌గ్రిడ్‌ లిమిటెడ్‌ ఎండీ సాంబశివరావు, ఇతర అధికారులు, గెయిల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 months later...

భావనపాడు రేవుకు పచ్చజెండా!
ఆదాయంలో 2.3 శాతం వాటా సర్కారుకు ఇవ్వడానికి అదానీ సుముఖత
కొలిక్కి వచ్చిన చర్చలు
ఉత్తరాంధ్ర సిగలో భారీ ఓడరేవు
నిర్మాణానికి రూ. 3,725 కోట్ల పెట్టుబడి
ఈనాడు - అమరావతి

ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘భావనపాడు’ ఓడరేవు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు పడింది. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) కింద ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ముందుకొచ్చిన ‘అదానీ’ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆదాయం వాటా విషయంలో ఏర్పడిన స్తబ్దతకు తెరపడింది. ఈ రేవు ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి 0.5శాతం వాటా మాత్రమే ఇస్తామని మొదట ప్రతిపాదించిన అదానీ సంస్థ.. సర్కారు అందుకు నిరాకరించటంతో.. దాన్ని 2.3శాతానికి పెంచేందుకు సమ్మతించటం ప్రాజెక్టులో ముందడుగు పడేందుకు నేపథ్యంగా నిలిచింది. అదానీ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ల మధ్య చర్చల అనంతరం.. ఓడరేవు ఆదాయంలో 2.3శాతం వాటాను రాష్ట్రసర్కారుకు ఇవ్వడానికి ఆ సంస్థ సుముఖత ప్రకటించింది. ఆదాయ పంపకాల్లో ఇరుపక్షాల నడుమ అవగాహన కుదరడంతో అదానీ సంస్థ వెంటనే ఓడరేవు నిర్మాణ పనులు ఆరంభించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు
భావనపాడు ఓడరేవు ఉత్తరాంధ్రకు ప్రధాన ప్రాజెక్టు కానుంది. బ్రిటిష్‌, డచ్‌ వారి హయాంలో భారతదేశ ఆర్థిక కార్యకలాపాలకు, వివిధ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు ఆయువుపట్టులా నిలిచిన ఘన చరిత ఈ రేవుకుంది. నవ్యాంధ్రలో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా పెద్దఎత్తున ఓడరేవులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా భావనపాడు ఓడరేవును ప్రవేటు పబ్లిక్‌ భాగస్వామ్యంతో నిర్మించి గత వైభవం తేవాలని సంకల్పించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మధ్య ఈ రేవును నిర్మించనున్నారు. మొత్తం 2500 ఎకరాల భూమిని ఇందుకోసం సేకరించనున్నారు. దీనిలో ప్రభుత్వ భూమి కేవలం 517ఎకరాలే. మిగిలిన భూమిని సేకరించనున్నారు. అదానీ సంస్థ ఒక్కటే ఈ రేవు నిర్మాణం కోసం ఆసక్తి వ్యక్తం చేయడంతో ఈ బాధ్యతలను దానికి అప్పగించారు. ‘అదానీ పోర్ట్సు, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ సంస్థ’ ఈ రేవు నిర్మాణానికి రూ.3,725 కోట్ల ఖర్చు చేయనుంది. మొత్తం 14 బెర్తులకు మొదటి దశలో ఐదింటిని నిర్మించి రెండు, మూడు దశల్లో మిగిలిన బెర్తులను పూర్తిచేయనుంది. ఈ రేవు ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ఆంధ్రప్రదేశ్‌ మధ్య పారిశ్రామిక నడవను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడి నుంచీ పెద్దఎత్తున గ్రానైట్‌, జీడిపప్పు, జనపనార, ఉక్కు, ఇనుము తదితరాలను వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. అలాగే విదేశాల నుంచీ ఎల్పీజీ, థర్మల్‌ విద్యుత్తు కోసం బొగ్గు, సున్నపురాయి. ఎరువులను దిగుమతి చేసుకోనున్నారు. తద్వారా ఈ ప్రాంతంలో పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ రేవు నుంచి ఏటా 60మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయాలనేది లక్ష్యంగా ఉంది.

శుభ పరిణామం: అజయ్‌జైన్‌
భావనపాడు రేవు ఆదాయంలో ప్రభుత్వానికి 2.3శాతం ఇవ్వడానికి అదానీ సంస్థ సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామమని పెట్టుబడులు, మౌలికసదుపాయాల విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ‘ఈనాడు’తో అన్నారు. రెండు వర్గాల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని, ఇక నిర్మాణ పనులకు వేగంగా అడుగులు పడతాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

Link to comment
Share on other sites

hmmm...single bid from adani only ante kashtam. credibility ledu. rigging jarigindi emo. Technically KPL management is proven than adani. vallu submit seyyaledu ante some strong reason ayi untadi.

yup, most likely rotation or sharing profits!

Link to comment
Share on other sites

  • 8 months later...
అదానీ చేతికి భావనపాడు!
21-01-2018 03:37:01
 
  • రెవెన్యూలో 2.3శాతం చెల్లింపునకు సరే
  • వాటా పెంచితే తుది ఒప్పందం
 
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా భావనపాడులో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ నాన్‌ మేజర్‌ పోర్టు నిర్మాణ బాధ్యతలను అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌కు అప్పగించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టును.. అదానీ సంస్థ చేపడుతుంది. ఇందుకు గాను తొలి 30 ఏళ్లలో మొత్తం ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తుంది. 31 నుంచి 40 ఏళ్ల వరకు 4.6 శాతం.. 41 నుంచి 50 ఏళ్ల వరకు 9.2 శాతం వాటాను ఇస్తుంది. న్యాయశాఖ, రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ సూచన మేరకు.. రెవెన్యూ వాటా విషయంలో అదానీ అండ్‌ ఎస్‌ఈజెడ్‌తో మరోసారి సంప్రదింపులు జరిపి మరికొంత పెంచేలా చూడాలని కేబినెట్‌ సూచించింది. అదానీ గనుక రెవెన్యూ వాటాను పెంచితే.. ముసాయిదా కన్సెషన్‌ అగ్రిమెంట్‌లో మార్పులూ చేర్పులూ చేసి తుది ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. భావనపాడు ఓడ రేవు నిర్మాణానికి ప్రభుత్వం 2130 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 1523 ఎకరాలు జిరాయితీ, 527 ఎకరాలు ప్రభుత్వ, 80 ఎకరాలు హార్బర్‌ భూములు ఉన్నాయి. ఈ భూములకు మార్కెట్‌ విలువలో 6 శాతం లీజుగా వసూలు చేస్తారు. అక్కడి నుంచి పోర్టు పాలసీ ప్రకారం ప్రతి ఏటా 2 శాతం చొప్పున పెంచుతారు.
 
శ్రీకాకుళం జిల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనలు 2011లోనే తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి పోర్టు నిర్మాణంపై ఎలాంటి నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకోలేదు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు దీని నిర్మాణంపై దృష్టి సారించారు. 2015 మే 13వ తేదీన రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఇన్‌క్యాప్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ అధ్యక్షతన కమిటీని వేశారు. ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన-మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శితో సాధికారితా కమిటీని కూడా నియమించారు. సాధికారితా కమిటీ భావనపాడు ఓడరేవు నిర్మాణం కోసం ఆసక్తి కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను కోరింది. ఇందుకు 12 ప్రీ క్వాలిఫైడ్‌ దరఖాస్తులు వచ్చాయి.
 
వీటిలో రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌ (ఆర్‌ఎ్‌ఫక్యూ)కు 5 వచ్చాయి. వాటిలో అదానీ, గంగవరం పోర్టు లిమిటెడ్‌, నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలు మాత్రమే క్వాలిఫై అయ్యాయి. ఈ క్వాలిఫైడ్‌ బిడ్డర్ల దరఖాస్తులను రక్షణ శాఖ పరిశీలించి.. అదానీకి మాత్రమే ఆమోదం తెలిపింది. అయితే.. ఆ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నాలుగు కేసులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే.. ఇటీవల కేరళలోనూ అదానీ సంస్థ ఓడరేవు నిర్మాణం చేపట్టింది. దీంతో.. రాష్ట్రంలోనూ ఆ సంస్థ ఓడరేవు నిర్మాణం పనులు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయశాఖ, అడ్వకేట్‌ జనరల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

పోర్టు
ఈనాడు, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అదాని పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించింది. దీనికి సంబంధించిన రాయితీ ఒప్పందాన్ని (కన్‌సెషన్‌ అగ్రిమెంట్‌) ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఒప్పందం కాలపరిమితి 33 ఏళ్లు. ఆ తర్వాత పదేళ్ల చొప్పున రెండుసార్లు పొడిగించుకునే అవకాశముంది. మొత్తం పోర్టుపై వచ్చే ఆదాయంలో మొదటి 30ఏళ్ల పాటు అదానీ సంస్థరాష్ట్ర ప్రభుత్వానికి 2.3శాతం వాటా చెల్లిస్తుంది. 31-40 ఏళ్ల మధ్య 4.6శాతం, 41-50 సంవత్సరాల నడుమ 9.2శాతం చొప్పున వాటా ఇస్తుంది.

Link to comment
Share on other sites

Congrats Uttarandhra folks....

CBN built Ganagavaram&kakinada&Krishnapatnam ports and again a NEW PORT started in this term only
 

 

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ‘భావనపాడు’ ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ బృహత్‌ నిర్మాణ బాధ్యతలను ‘అదానీ’ కంపెనీకి అప్పగించింది. నిర్మాణం తరువాత లాభాల్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిష్పత్తిపై కూడా ఇటీవల ఒక అవగాహనకు వచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో మరోసారి కీలక పరిశీలన శుక్రవారం జరగనుంది. జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డి, అదానీ పోర్టు డైరెక్టర్‌ రవికుమార్‌, కాకినాడ పోర్టు డైరెక్టర్‌  ప్రవీణ్‌కుమార్‌, తదితరులు భావనపాడుకు వస్తున్నారు. ఈ వివరాలను తహసీల్దార్‌ రామారావు గురువారం వెల్లడించారు. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ ఓడరేవు కోసం ఇప్పటికే భూములను గుర్తించారు. పరిహారంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి దక్కే ప్రయోజనాలు, ఇచ్చే చేయూతపై కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్షిస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత నిర్మించనున్న తొలి ఓడరేవు కావటంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తై నెలలు గడుస్తున్నా ఆ అంశంపై కదలికలు లేకపోవటంతో ఇటీవలి వరకూ పలు సందేహాలు ముసురుకున్నాయి. కానీ, ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో మళ్లీ ఆశలు  చిగురిస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 3 months later...
  • 2 weeks later...
  • 1 month later...

Adani gadiki queries మీద queries వేసి edipinchali vadu మోడీ daggarikelli mothukovali.. He is unfit like pm అని declare చేసి cancel చేసి dobbali, jus imagination భలే vundi.. 

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 5 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...