Jump to content

Amaravati


Recommended Posts

ఐకానిక్‌ వంతెనకు శ్రీకారం
29-12-2018 02:38:35
 
636816479152238679.jpg
  • పవిత్ర సంగమంలో స్టాకు యార్డు రెడీ
  • శిలాఫలకం సిద్ధం చేస్తున్న ఎల్‌ అండ్‌ టీ
  • జనవరిలో సీఎంతో శంకుస్థాపన
  • కూచిపూడి నాట్య భంగిమలో నిర్మాణం
  • అసెంబ్లీ భవనానికి బిడ్ల ఆహ్వానం
  • మొత్తం 1049 కోట్ల అంచనా వ్యయం
  • తొలిదశలో 439.5 కోట్లతో సివిల్‌ పనులు
విజయవాడ(ఇబ్రహీంపట్నం), డిసెంబరు 28: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్‌ వంతెన పనులకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం నుంచి రాజధాని ప్రాంతంలోని తాళ్లాయిపాలెం వరకు కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ పనులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) పర్యవేక్షిస్తుంది. 3.2 కిలోమీటర్ల మేర ఆరు వరసలుగా దీనిని నిర్మిస్తారు. జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
 
పవిత్ర సంగమం వద్ద శిలాఫలకాన్ని గోదావరి ఘాట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్టాకు యార్డును ఇప్పటికే సిద్ధం చేశారు. నదిలో పిల్లర్లు(పైల్స్‌) వేసేందుకు అవసరమైన అతిపెద్ద ఐరన్‌ ఫంట్స్‌(బార్జ్‌లు) సిద్ధం చేసి నదిలోకి దింపుతున్నారు. ఇంజనీర్లు మార్కింగ్‌ను పూర్తి చేశారు. పైల్‌ కాంక్రీటుకు మెటీరియల్‌ త్వరలో వస్తుందని చెబుతున్నారు. నదిలో 36 పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ నుంచి వంతెన ఉంటుంది. వాస్తవానికి గత ఏడాదే ఈ వంతెన నిర్మాణానికి ఈపీసీ విధానంలో ఏడీసీ టెండర్లు పిలిచింది. అయితే నిర్మాణ వ్యయాన్ని రూ.1432 కోట్ల నుంచి రూ.1349 కోట్లకు తగ్గించడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిర్మాణ వ్యయం రూ.86 కోట్ల మేర తగ్గించి తిరిగి టెండర్లను పిలవగా ఎల్‌అండ్‌టీ పనులు దక్కించుకుంది. ఆరు డిజైన్లను ఈ సంస్థ ఇంజనీర్లుకు సీఎంకి చూపగా వాటిలో కూచిపూడి నాట్యభంగిమను తలపించే డిజైన్‌కు ఆమోద ముద్ర వేశారు.
 
అమరావతికి ఐకానిక్‌ మార్గం!
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ వైపు నుంచి అమరావతికి చేరుకునేందుకు చాలా సమయం ఆదా అవుతుంది. 65వ నంబరు జాతీయ రహదారిలో ఇబ్రహీంపట్నం నుంచి కేవలం 3.2 కిలోమీటర్లు వంతెనపై ప్రయాణిస్తే రాజధానికి చేరుకోవచ్చు. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతవాసులకూ రాజధానితో అనుసంధానం మరింత పెరుగుతుంది. విజయవాడపై ట్రాఫిక్‌ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది.
Link to comment
Share on other sites

ఐకానిక్‌ వంతెనకు శ్రీకారం
29-12-2018 02:38:35
 
636816479152238679.jpg
  • పవిత్ర సంగమంలో స్టాకు యార్డు రెడీ
  • శిలాఫలకం సిద్ధం చేస్తున్న ఎల్‌ అండ్‌ టీ
  • జనవరిలో సీఎంతో శంకుస్థాపన
  • కూచిపూడి నాట్య భంగిమలో నిర్మాణం
  • అసెంబ్లీ భవనానికి బిడ్ల ఆహ్వానం
  • మొత్తం 1049 కోట్ల అంచనా వ్యయం
  • తొలిదశలో 439.5 కోట్లతో సివిల్‌ పనులు
విజయవాడ(ఇబ్రహీంపట్నం), డిసెంబరు 28: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్‌ వంతెన పనులకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం నుంచి రాజధాని ప్రాంతంలోని తాళ్లాయిపాలెం వరకు కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ పనులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) పర్యవేక్షిస్తుంది. 3.2 కిలోమీటర్ల మేర ఆరు వరసలుగా దీనిని నిర్మిస్తారు. జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
 
పవిత్ర సంగమం వద్ద శిలాఫలకాన్ని గోదావరి ఘాట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్టాకు యార్డును ఇప్పటికే సిద్ధం చేశారు. నదిలో పిల్లర్లు(పైల్స్‌) వేసేందుకు అవసరమైన అతిపెద్ద ఐరన్‌ ఫంట్స్‌(బార్జ్‌లు) సిద్ధం చేసి నదిలోకి దింపుతున్నారు. ఇంజనీర్లు మార్కింగ్‌ను పూర్తి చేశారు. పైల్‌ కాంక్రీటుకు మెటీరియల్‌ త్వరలో వస్తుందని చెబుతున్నారు. నదిలో 36 పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ నుంచి వంతెన ఉంటుంది. వాస్తవానికి గత ఏడాదే ఈ వంతెన నిర్మాణానికి ఈపీసీ విధానంలో ఏడీసీ టెండర్లు పిలిచింది. అయితే నిర్మాణ వ్యయాన్ని రూ.1432 కోట్ల నుంచి రూ.1349 కోట్లకు తగ్గించడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిర్మాణ వ్యయం రూ.86 కోట్ల మేర తగ్గించి తిరిగి టెండర్లను పిలవగా ఎల్‌అండ్‌టీ పనులు దక్కించుకుంది. ఆరు డిజైన్లను ఈ సంస్థ ఇంజనీర్లుకు సీఎంకి చూపగా వాటిలో కూచిపూడి నాట్యభంగిమను తలపించే డిజైన్‌కు ఆమోద ముద్ర వేశారు.
 
అమరావతికి ఐకానిక్‌ మార్గం!
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ వైపు నుంచి అమరావతికి చేరుకునేందుకు చాలా సమయం ఆదా అవుతుంది. 65వ నంబరు జాతీయ రహదారిలో ఇబ్రహీంపట్నం నుంచి కేవలం 3.2 కిలోమీటర్లు వంతెనపై ప్రయాణిస్తే రాజధానికి చేరుకోవచ్చు. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతవాసులకూ రాజధానితో అనుసంధానం మరింత పెరుగుతుంది. విజయవాడపై ట్రాఫిక్‌ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది.
Link to comment
Share on other sites

అదిగో అమరావతి!
29-12-2018 02:52:19
 
636816487388831700.jpg
  • సందడిగా రాజధాని బస్సు యాత్ర ప్రారంభం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణ విశేషాలను రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన అమరావతి యాత్రలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు యాత్రలో కర్నూలు జిల్లా సంజామల, విజయనగరం జిల్లా కురుపాం, చిత్తూరు జిల్లా రామకుప్పం, శాంతిపురం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలాలకు చెందిన సుమారు 600మంది పాల్గొన్నారు. వీరికి ఉద్దండరాయునిపాలెం ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వద్ద సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ స్వాగతం పలికారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ 3డీ మోడల్‌ను వారికి చూపించి, దాని విశేషాలను వివరించారు. అనంతరం సందర్శకులు రాజధానికి కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును తిలకించారు. భూమిలేని పేదల కోసం మందడంలో నిర్మించిన నివాసాలను, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలను చూపించారు. అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణ ప్రదేశాలతో పాటు సచివాలయ టవర్లు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయాన్ని చూశారు. కాగా, ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలివచ్చిన వారికోసం ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీయే ప్రత్యే క కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. అందులో సందర్శకులకు భోజన వసతి కల్పించారు. ఈ ఏర్పాట్లను సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ పర్యవేక్షించారు.
 

 

Link to comment
Share on other sites

AP Secretariat Raft foundation in single pour

By Sambasiva Rao | THE HANS INDIA |   Dec 27,2018 , 10:33 AM IST
   

 
 
 
AP Secretariat Raft foundation in single pour
AP Secretariat Raft foundation in single pour
 
 
 Amaravati: The massive raft foundation for construction of AP Secretariat and Heads of the Buildings complex has started for the Towers on Thursday, as Chief Minister N Chandrababy Naidu participated in the work and performed Santi Puja.
 
There will be five towers with a maximum height of 225 meters, becoming tallest administrative buildings in the country.
 
 
 
Each tower will have approximately 11000 cubic meters of high grade concrete of great strength in a single pour and around 1250 tons of steel reinforcement.
 
 
 
The rafts for the five towers will be consuming 57,000 cubic meters of concrete and 6,500 metric tons of steel.
 
High capacity cranes be deployed even to place the 32 mm diameter steel rod bundles in place.
 
Despite the rainy season, type of soil and level of the water table; the construction is being undertaken at breakneck pace, explained the officials at AP Capital Region Development Authority.
 
The depth of the basement is about 35 feet and is being constructed overcoming the high water table.
 
Two layers HDPE waterproofing membranes laid on horizontal and vertical surfaces below raft foundation.
 
Being high raised building with estimated 225 meters height, the concrete used in these rafts is required to be of high strength and needed to be M45 grade.
 
Concrete mix for the building is designed by expert professors in IIT, Madras. High quality materials from many different locations are being utilized. Concrete mix also uses GGBS and fly ash as ingredients considering technical improvements and LEED platinum requirements.
 
The contractors also have to set up four batching plants within 2 kilometers and water chilling facilities to cater to this project alone.
 
The temperature of the poured concrete will be continuously monitored using thermal sensors for a period of one week to ensure that it is under control and has cured as per the design.
 
The entire volume of 11,000 cubic meters of concrete per raft has to be poured nonstop in multiple layers before each layer achieves initial setting time and it requires approximately 1950 trips of the concrete mixer truck. The estimated duration to finish this raft in a single pour is 72 hours which means around 650 trucks per day per raft.
 
The supervisory personnel in rotation and machines will be working continuously day and night for 72 hours to achieve this task. Local Amaravati traffic was rerouted temporarily.
 
Construction methodology
 
After the raft the construction will continue on the core, the centre part of the building containing all the services, lifts and staircases.
 
This core wall is the other main structural component apart from the steel diagrid and consists of even higher grade of concrete, which is M60.
 
Once the core walls have been raised at least 7 floors, the steel diagrid installation will begin from the basement.
 
The gigantic steel members, each piece weighing almost 14 tons will have to be carefully shifted in place using special high capacity cranes and installed piece by piece. The node which connects each of these steel members together is prefabricated in factory and weighs almost 4 tons each.
 
The diagrid steel member will be installed for three floors at a time followed by the floor decks for each level.
 
The best contractors with the capacity to handle this mega project are in place namely NCC, SPCL and L&T and supervised by Egis an international Project Management Company. 
 
 
 

 
Link to comment
Share on other sites

అమరావతిని ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
29-12-2018 11:10:41
 
636816787800084103.jpg
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తొలిదశలో రూ.51 వేల కోట్లు, రెండో దశలో రూ. 50 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం ఇంధన రంగం-మౌలిక వసతుల కల్పనపై ఏడో శ్వేతపత్రాన్ని సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 మిలియన్ల మందికి ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి అని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం, అమృత్, విట్ వంటి వర్సిటీలు వచ్చాయని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. 80 వేల హోటల్ గదులు రాజధానికోసం అవసరమని, 2400 కిలో మీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేశామని చెప్పారు. 11 జాతీయ రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 130 వంతెనలు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.
Link to comment
Share on other sites

అదిగో అమరావతి!
29-12-2018 02:52:19
 
636816487388831700.jpg
  • సందడిగా రాజధాని బస్సు యాత్ర ప్రారంభం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణ విశేషాలను రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన అమరావతి యాత్రలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు యాత్రలో కర్నూలు జిల్లా సంజామల, విజయనగరం జిల్లా కురుపాం, చిత్తూరు జిల్లా రామకుప్పం, శాంతిపురం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలాలకు చెందిన సుమారు 600మంది పాల్గొన్నారు. వీరికి ఉద్దండరాయునిపాలెం ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వద్ద సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ స్వాగతం పలికారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ 3డీ మోడల్‌ను వారికి చూపించి, దాని విశేషాలను వివరించారు. అనంతరం సందర్శకులు రాజధానికి కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును తిలకించారు. భూమిలేని పేదల కోసం మందడంలో నిర్మించిన నివాసాలను, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలను చూపించారు. అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణ ప్రదేశాలతో పాటు సచివాలయ టవర్లు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయాన్ని చూశారు. కాగా, ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలివచ్చిన వారికోసం ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీయే ప్రత్యే క కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. అందులో సందర్శకులకు భోజన వసతి కల్పించారు. ఈ ఏర్పాట్లను సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ పర్యవేక్షించారు.
Link to comment
Share on other sites

అసెంబ్లీ భవనానికి బిడ్ల ఆహ్వానం
29-12-2018 02:39:26
 
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాల వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే మరో భారీ ఐకానిక్‌ భవనానికి సంబంధించి కీలక అడుగు పడింది. రెండు ఐకానిక్‌ భవంతుల్లో ఒకటైన హైకోర్టుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన ఏపీసీఆర్డీయే తాజాగా అసెంబ్లీ భవన నిర్మాణానికి బిడ్లను ఆహ్వానించింది. 250 మీటర్ల ఎత్తుతో, ఆకాశంలోకి చొచ్చుకుపోయిందా అనిపించేలా, సూదిమొనను తలపించే టవర్‌తో దీనిని నిర్మించనున్న సంగతి తెలిసిందే. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ప్లస్‌ 3 అంతస్తులతో రూపొందేందుకు రూ.1049 కోట్ల వ్యయమవుతుందని సీఆర్డీయే అంచనా వేసింది. ఇందులో తొలి దశగా రూ.439.50 కోట్ల అంచనా వ్యయంతో సివిల్‌ పనులను చేపట్టాలని నిశ్చయించి, టెండర్లను ఆహ్వానించింది. మిగిలిన రూ.609.50 కోట్లతో అంతర్గత పనులు, వసతుల కల్పన, డెకరేటివ్‌ లైటింగ్‌ తదితర పనులకు దశలవారీగా టెండర్లను పిలవనుంది.
 
3 నుంచి బిడ్లు!: ప్రస్తుతం టెండర్లు పిలిచిన సివిల్‌ పనుల్లో ఎర్త్‌ వర్క్‌, పైల్‌ లేదా ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌, ఆర్‌.సి.సి. ఫ్రేమ్‌తో కూడిన స్ట్రక్చర్‌, రిటైనింగ్‌ వాల్‌, షియర్‌- కోర్‌ వాల్‌, శ్లాబులు, బీం, కాలమ్స్‌, వాటర్‌ ప్రూఫింగ్‌ తదితర సివిల్‌ నిర్మాణాలన్నింటినీ సీఆర్డీయే చేర్చింది. ఇవి కాకుండా ‘గృహ’ 5 స్టార్‌ రేటింగ్‌ ధృవీకరణ సాధనకు అవసరమైన పనులను కూడా పైన పేర్కొన్న రూ.439.50 కోట్లతో పిలిచిన టెండర్‌ డాక్యుమెంట్‌లో ఉటంకించింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...