Jump to content

Amaravati


Recommended Posts

7 hours ago, sonykongara said:
అసెంబ్లీ భవనానికి బిడ్ల ఆహ్వానం
29-12-2018 02:39:26
 
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాల వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే మరో భారీ ఐకానిక్‌ భవనానికి సంబంధించి కీలక అడుగు పడింది. రెండు ఐకానిక్‌ భవంతుల్లో ఒకటైన హైకోర్టుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన ఏపీసీఆర్డీయే తాజాగా అసెంబ్లీ భవన నిర్మాణానికి బిడ్లను ఆహ్వానించింది. 250 మీటర్ల ఎత్తుతో, ఆకాశంలోకి చొచ్చుకుపోయిందా అనిపించేలా, సూదిమొనను తలపించే టవర్‌తో దీనిని నిర్మించనున్న సంగతి తెలిసిందే. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ప్లస్‌ 3 అంతస్తులతో రూపొందేందుకు రూ.1049 కోట్ల వ్యయమవుతుందని సీఆర్డీయే అంచనా వేసింది. ఇందులో తొలి దశగా రూ.439.50 కోట్ల అంచనా వ్యయంతో సివిల్‌ పనులను చేపట్టాలని నిశ్చయించి, టెండర్లను ఆహ్వానించింది. మిగిలిన రూ.609.50 కోట్లతో అంతర్గత పనులు, వసతుల కల్పన, డెకరేటివ్‌ లైటింగ్‌ తదితర పనులకు దశలవారీగా టెండర్లను పిలవనుంది.
 
3 నుంచి బిడ్లు!: ప్రస్తుతం టెండర్లు పిలిచిన సివిల్‌ పనుల్లో ఎర్త్‌ వర్క్‌, పైల్‌ లేదా ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌, ఆర్‌.సి.సి. ఫ్రేమ్‌తో కూడిన స్ట్రక్చర్‌, రిటైనింగ్‌ వాల్‌, షియర్‌- కోర్‌ వాల్‌, శ్లాబులు, బీం, కాలమ్స్‌, వాటర్‌ ప్రూఫింగ్‌ తదితర సివిల్‌ నిర్మాణాలన్నింటినీ సీఆర్డీయే చేర్చింది. ఇవి కాకుండా ‘గృహ’ 5 స్టార్‌ రేటింగ్‌ ధృవీకరణ సాధనకు అవసరమైన పనులను కూడా పైన పేర్కొన్న రూ.439.50 కోట్లతో పిలిచిన టెండర్‌ డాక్యుమెంట్‌లో ఉటంకించింది.

High Court ki Tenders eppudu pilicharu eppudu confirm chesaru ?? Ee company ki icharu. nenu miss ayyanu.

Link to comment
Share on other sites

To show to public, better complete govt officials buildings 100% with greenary jus like bunch of gated communities along 1-2 kms stretch thn it looks better to public, ఇక్కడ activity gattiga vundi అనే ఫీలింగ్ povali Election time కల్లా... 

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

bro mi meda naku kopam vasthundi,shapoorji pallonji adiki vacchindi august  lo..

woh. ichara. nenu follow avvatledu sony bro ee madya development baaga busy ga undi work lo. so ala miss avuthunna chaala news. 

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

punadula ki matti kuda tovveru a video kuda chusa,taruvtha update theliyadu bro.

nice bro. so high court, secretariat, iconic bridge start ayipoyayi ayithe. only pending is assembly tower and AP NRT towers. avi kuda start ayipothe inko one year lo amaravati superb shape ki vosthadi. :super:

Link to comment
Share on other sites

3 minutes ago, LuvNTR said:

nice bro. so high court, secretariat, iconic bridge start ayipoyayi ayithe. only pending is assembly tower and AP NRT towers. avi kuda start ayipothe inko one year lo amaravati superb shape ki vosthadi. :super:

APNRT tower ni aputunnaru crda vallu ani news vacchindi bro

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

3 minutes ago, LuvNTR said:

nice bro. so high court, secretariat, iconic bridge start ayipoyayi ayithe. only pending is assembly tower and AP NRT towers. avi kuda start ayipothe inko one year lo amaravati superb shape ki vosthadi. :super:

cbn mali vasthe chalu bro,AP india ki chukkalu chupisthundi..

Link to comment
Share on other sites

అమరావతి అద్భుతాల నిలయం..
30-12-2018 07:42:45
 
636817525624429902.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధానిలో పెద్దఎత్తున జరుగుతున్న పనులపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి సందర్శన యాత్రల్లో రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలినాడైన శుక్రవారం సందర్శకుల సంఖ్య సుమారు 600 ఉండగా, శనివారంనాడది రమారమి వెయ్యికి చేరడం విశేషం! 2వ రోజు యాత్రలో పాల్గొన్న వారిలో శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు, విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, కర్నూలు జిల్లా కల్లూరు, ఆదోని, అనంతపురం జిల్లా మడకశిర, హగలి, రోళ్ల, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెం, వి.కోట, కృష్ణా జిల్లా విస్సన్నపేట, పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల, ప్రకాశం జిల్లా కురిచేడు, ఒంగోలు అర్బన్‌, రూరల్‌, తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఉన్నారు.
 
అమరావతి సందర్శన యాత్రలో భాగంగా తమ తమ ప్రాంతాల నుంచి తొలుత రాజధానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన జరిపిన ఉద్ధండరాయునిపాలెంలోని ప్రదేశాన్ని సందర్శకులు తిలకించారు. అక్కడ సీఆర్డీయే అధునాతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వారిని ఆకట్టుకుంది. అక్కడి అధికారులు వారికి రాజధానికి సంబంధించిన వివరాలను, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ టవర్లు ఇత్యాది వాటికి చెందిన విశేషాలను తెలియజెప్పారు. అనంతరం అమరావతిలోని తూర్పు- పశ్చిమ కొసలను కలిపే సీడ్‌ యాక్సెస్‌ రహదారితోపాటు ఇతర ప్రధాన రహదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు (ఏఐఎస్‌), గెజిటెడ్‌ అఽధికారులు, ఎన్జీవోలు, గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మితమవుతున్న భారీ టవర్లను సందర్శకులు పరిశీలించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక నిర్వహణకు వీలుగా తుది మెరుగులు దిద్దుకుంటున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సెక్రటేరియట్‌- హెచ్‌వోడీ కార్యాలయాల కోసం నిర్మిస్తున్న టవర్లలో ఒకదానికి జరుగుతున్న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను ఆసక్తిగా తిలకించారు.
 
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి కూడా వెళ్లి, అందులోని పచ్చదనంతోపాటు అధికారులు, ఉద్యోగుల ఛాంబర్లను చూశారు. మొత్తం 16 ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలి వచ్చిన సందర్శకుల సౌకర్యార్ధం ఉద్ధం డరాయునిపాలెం వద్ద సీఆర్డీయే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో మధ్యాహ్న భోజనాలు, ఇతర వసతులు కల్పించారు. కాగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కాకుండా విజయవాడ, గుంటూరు, అమరావతి పరిసరాల్లోని పలు ప్రదేశాల నుంచి కూడా పలువురు తమకు తాముగా రాజధాని సందర్శనకు విచ్చేశారు. వీరిలో రైతులు, ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా పెద్దసంఖ్యలో మహిళలు, యువ తీయువకులు ఉండడం విశేషం. వీరు ప్రధానంగా ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు జరుగుతున్న సెక్రటేరియట్‌ 2వ టవర్‌ను, ప్రభుత్వ గృహ సముదాయాలను, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను చూసేందుకు ఆసక్తి చూపారు. సెల్ఫీలు, కుటుంబ సభ్యులతో కలసి ఫొటోలు దిగుతూ ఆయా ప్రాంతాల్లో సందడిసందడిగా గడిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...