Jump to content

Chilakaluripet bypass


Recommended Posts

చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డుకు రూ.600 కోట్లు
 
636028659214764929.jpg
  •  గణపవరం - మురికిపూడి వరకు 16 కి.మీ. నిర్మాణం 
  • 340 ఎకరాల భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ 
  • అధికారులతో చర్చించిన ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
ఆంధ్రజ్యోతి-గుంటూరు: సుమారు దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణపవరం నుంచి మురికిపూడి వరకు సుమారు 16 కిలోమీటర్ల పొడువునా రూ.600 కోట్లతో ఆరు వరసల రహదారిని నిర్మించేందుకు ప్రభ్వుతం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అవసరమైన భూములను సేకరించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని తాజాగా ఆదేశించింది. రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బీ శ్యాంబాబ్‌ బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చి రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో చర్చించారు. భూములు ఇచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మెరుగైన ప్యాకేజ్‌ను ప్రభుత్వం ఇవ్వబోతోందని, ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి ఒప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐదో నెంబర్‌ జాతీయ రహదారిని విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి గుంటూరు, ఒంగోలు మీదగా చెన్నై వరకు ఆరు వరసలుగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మాణం చేస్తోన్న విషయం తెలిసిందే. జిల్లా పరిధిలో ఒక్క చిలకలూరిపేట బైపాస్‌ మినహా ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ఆరు వరసల రహదారితో పాటు రెండు వైపులా రెండు వరసల సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేసింది. చిలకలూరిపేట పట్టణం లోపల నుంచి ప్రస్తుతం హైవే నిర్మాణం జరిగింది. దీని వల్ల ట్రాఫిక్‌ పరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతోన్నాయి. మరోవైపు చిలకలూరిపేట పట్టణం వేగవంతంగా విస్తరిస్తోన్నది. ఈ నేపథ్యంలో బైపాస్‌ రోడ్డు తప్పనిసరిగా నిర్మించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఆరు, ఏడు సంవత్సరాల క్రితమే బైపాసు రోడ్డు ప్రతిపాదన వచ్చింది. రైతుల పొలాల మీదగా గణపవరం నుంచి మురికిపూడి వరకు ఎలైనమెంట్‌ను గుర్తించారు. అయితే రైతులు హైకోర్టుకు వెళ్లడంతో బైపాసు రోడ్డు ప్రతిపాదన పెండింగ్‌లో పడిపోయింది. కేసు ఇటీవలే ఒక కొలిక్కి రావడంతో ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా భూమిని సేకరించి ఎనహెచఏఐకి అప్పగించాలని నిర్ణయించింది. బైపాసు రోడ్డు నిర్మాణంలో భాగంగా మూడు వంతెనలు, పరిమిత ఎత్తు సబ్‌వేలు నిర్మించనున్నారు. అలానే ప్రజలు, పశువుల రాకపోకలకు వీలుగా సర్వీసు రోడ్లను నిర్మాణం చేస్తారు. సాధ్యమైనంత త్వరగా క్షేత్ర సర్వే నిర్వహించి ప్రభుత్వం ఆమోదం తీసుకొని భూసేకరణ నోటిఫికేషన విడుదల చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నాగబాబుకు సూచించారు. 
 
 
 
  •  

 

Link to comment
Share on other sites

This article is not clear. There is something missing in that statement.

Did the AP government agree to pay

1) 25% of land acquisition or

2) 25% of total project cost or

3) 25% of construction cost + 100% land acquisition cost?

25% of construction cost + 100% land acquisition cost !

Link to comment
Share on other sites

  • 1 year later...
లకలూరిపేట ప్రజల ట్రాఫిక్‌ కష్టాలకు తెర!
14-12-2017 08:43:20
 
636488378057303852.jpg
  • త్వరలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు
  • సర్వేలో తలమునకలైన అధికారులు
  • రూ.9.62 కోట్లతో ‘యడ్లపాడు-బొప్పూడి’ జాతీయ రహదారి అభివృద్ధి
 
చిలకలూరిపేట : జాతీయ రహదారిపై చిలకలూరిపేట ప్రాంత ప్రజల ట్రాఫిక్‌ కష్టాలకు తెరపడనుంది. మరో ఆరునెలల్లో 16 కిలో మీటర్ల మేర నిర్మించనున్న ఆరు వరుసల బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సర్వే పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. నేషనల్‌ హైవేస్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల పరిధిలో పూర్తిస్థాయిలో సర్వే పనులలో నిమగ్నమయ్యారు. సర్వే పనులు పూర్తయిన వెంటనే జనవరి మొదటి వారంలో నిబంధనల ప్రకారం 3డీ పబ్లికేషన్‌ చేస్తారు. అనంతరం విచారణ, వచ్చే ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచి బైపాస్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభించనున్నారు.
 
పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై గుంటూరు-ఒంగోలు మధ్య చిలకలూరిపేట వద్ద యడ్లపాడు నుంచి బొప్పూడి వరకు నాలుగులైన్ల రహదారి మాత్రమే ఉంది. వాహనాల రద్దీ పెరిగి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపానలు చేసినప్పటికీ అడ్డంకులు, కోర్టు కేసులతో జాప్యం జరిగింది. సుమారు 16 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న బైపాస్‌ రోడ్డుకు దాదాపుగా లైన్‌ క్లియరైంది. ఇందుకు 431 ఎకరాల భూమిని సేకరించేందుకు రెవెన్యూ యం త్రాంగం సిద్ధమైంది. మురికిపూడి గ్రామ పరిధిలో 9.76 ఎకరాలు, బొప్పూడి లో 90.74, పురుషోత్తమపట్నం, చిలకలూరిపేట ప్రాంతాలలో 108.64, నాదెండ్లలో 41.97, తిమ్మాపురంలో 93.37 ఎకరాలు సేకరించనున్నారు. రైతులు నష్టపోకుండా మంచి ధర ఇప్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం చిలకలూరిపేటలో ఆర్డీవో రవీందర్‌ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట, పురుషోత్తమపట్నం ప్రాంతాలలో ఎకరాకు రూ.74 లక్షలు, గణపవరం ప్రాంతంలో ఎకరాకు రూ.49 లక్షలు, మురికిపూడి ప్రాంతంలో రూ.25 లక్షలు, నాదెండ్లలో రూ.33 లక్షలు ధర లభించే అవకాశం ఉందని రైతులకు తెలిపారు. ఇంతకాలం సర్వేకు కూడా అంగీకరించని రైతులు ఈ దఫా అభ్యంతరం చెప్పలేదు. దీంతో సర్వే సజావుగా సాగుతోంది.
 
రూ.9.62 కోట్లతో యడ్లపాడు-బొప్పూడి రహదారి అభివృద్ధి..
బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరిగేలోపు యడ్లపాడు నుంచి బొప్పూడి వరకు ప్రస్తుతం 14.5 కిలో మీటర్ల మేర ఉన్న నాలుగు లైన్ల జాతీయ రహదారిని సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్టు నేషనల్‌ హైవేస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇందు కోసం రూ.9.62 కోట్లు మంజూరైనట్లు ఆయన చెప్పారు. టెండర్లు కూడా పూర్తయ్యాయని, మరో పదిహేను రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. నాలుగు నెల్లో పనులు పూర్తవుతాయని ఆయన వివరించారు. ఇందులో భాగంగా సర్వీసు రోడ్లు, కాల్వలను అవసరమైనచోట్ల పునర్నిర్మించడం, మరమ్మతులు చేయడంతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌, గ్రీనరీ తదితర పనులు చేయనున్నట్లు తెలిపారు. 2018-19 సంవత్సరంలో బైపాస్‌ రోడ్డు కల సాకారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

  • 6 months later...
  • 3 weeks later...

Land evsridains okate ...e bypass Land pottunna andaru hardcore tdp gramalu...like what cbn did in other places hope they get final happy rate...

same inko 8 gramalu a pakkane atp route lo polalu potai..koncham atu itu new lift canal ki kuda potai...both vykuntapuram&gundlakamma godavari lo

 

E govt lo land poyi nastspoyaru anedi ledu.Konni chotla kavalani(undavalli,penumaka noti kochina rate,nidamanuru 22 crores extralu)mari ati chesaru...

hope these people make good settlement 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

14 minutes ago, AnnaGaru said:

Land evsridains okate ...e bypass Land pottunna andaru hardcore tdp gramalu...like what cbn did in other places hope they get final happy rate...

same inko 8 gramalu a pakkane atp route lo polalu potai..koncham atu itu new lift canal ki kuda potai...both vykuntapuram&gundlakamma godavari lo

 

E govt lo land poyi nastspoyaru anedi ledu.Konni chotla kavalani(undavalli,penumaka noti kochina rate,nidamanuru 22 crores extralu)mari ati chesaru...

hope these people make good settlement 

undavalli,penumaka  vilani leplani ane antha kopam undi valla adggie rate india lo e state ivvadu mari athi cheyyakudadu vallu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...