Jump to content

farmer ki


Recommended Posts

సన్న రైతులకూ జలసిరి
 
  • రెండున్నర ఎకరాకొక బోరు 
  • మార్గదర్శకాల సవరణ యోచనలో ప్రభుత్వం 
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు మళ్లీ పొడిగింపు 
  • రేపోమాపో జీవో విడుదల 
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఇక సన్న, చిన్నకారు రైతులకూ ఎన్టీఆర్‌ జలసిరి దక్కనుంది. వీరికి కూడా బోరు బావి మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో... ‘ఐదెకరాలు ఉంటేనే..’ అనే నిబంధనను మార్చి గరిష్ఠస్థాయిలో జల వనరులను అందుబాటులోకి తెచ్చి సాగును పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఎన్టీఆర్‌ జలసిరి పథకం ద్వారా ప్రతి ఐదెకరాలకు ఒక బోరు వేసేందుకు ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా తప్ప మిగిలిన 12 జిల్లాలకు సంబంధించి 1,24,349 బోరుబావులు మంజూరుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ‘ఐదెకరాలు ఉంటేనే బోరు’ అనే నిబంధనల వల్ల పలువురు రైతులు నిరాశకు లోనయ్యారు. భాగస్తులతో బోరుబావుల నిర్వహణకు ఇబ్బందులున్నాయని పలువురు రైతులు దరఖాస్తు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 1,24,349 బోర్లు మంజూరయ్యే అవకాశమున్నా... 1,04,832 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. డెల్టా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ రైతులు ఎక్కువ మంది మూడెకరాల్లోపే కలిగి ఉన్నారు. దీంతో ‘ఐదెకరాలకో బోరు’ నిబంధన వల్ల అందరూ ప్రయోజనం పొందలేకున్నారని, రెండన్నర ఎకరాకొక బోరు మంజూరు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలను సమీక్షించాలని భావించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ గ్రీన సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే... బోర్ల కోసం ఆనలైన దరఖాస్తు ప్రక్రియ గత నెలాఖరుకే పూర్తయినా తిరిగి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ‘రెండున్నర ఎకరాకొక బోరు’కు సంబంధించి ఉత్తర్వులు రేపోమాపో విడుదల కానున్నాయి.
 
అత్యధికంగా విజయనగరం జిల్లాలో..
12 జిల్లాల్లో అత్యధికంగా విజయనగరం జిల్లా నుంచి ఎన్టీఆర్‌జలసిరి కోసం 18,640 మంది దరఖాస్తు చేసుకున్నారు. 11,913 బోర్లు మంజూరయ్యే అవకాశమున్న పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1140 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వివిధ జిల్లాలకు కేటాయించిన బోర్లను పరిశీలిస్తే అత్యధికంగా విజయనగరం జిల్లాకు 15,929, కడప జిల్లాకు అత్యల్పంగా 285 కేటాయించారు.
Link to comment
Share on other sites

రుణమాఫీతో ప్రాణాలు నిలిపారు!
 
636022539431482961.jpg
  •  మీ మేలు జన్మలో మరువలేం 
  •  ముఖాముఖిలో సీఎంతో రైతులు 
ఒంగోలు నగరం: ‘మీ మేలు జన్మలో మరిచిపోలేం.. మీరు మాకు చేసిన ప్రయోజనం అంతా ఇంతా కాదు. కాలం కలిసి రాక పంటలు పండక అప్పులు తీర్చలేకపోయాం. ఇక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్న తరుణంలో మీరు మా బ్యాంకు రుణాలను మాఫీ చేసి, మా ప్రాణాలు నిలిపారు. రుణమాఫీతో ఎంతో ఉపశనమనం పొందుతున్నాం’ అంటూ పలువురు రైతులు సీఎ చంద్రబాబుతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు. రెండో విడత రుణ ఉపశమన పత్రాలు అందజేసేందుకు బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన సీఎం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రుణమాఫీ వలన చేకూరిన లబ్ధి గురించి ఆరా తీశారు. తాను రుణమాఫీ ప్రకటించే సమయానికి రాష్ట్రం ఉమ్మడిగా ఉందని, అధికారం చేపట్టాక రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్‌తో బయటకు వచ్చామని అయినప్పటికీ ఇచ్చిన మాటపై నిలబడి రుణ మాఫీ చేశానన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
రైతులలో సీఎం ముఖాముఖి సాగింది ఇలా..
రైతు: నా పేరు వరహాల చౌదరి, మాది మద్దిపాడు మండలం మల్లవరం.
సీఎం: రుణమాఫీతో ఎలాంటి ప్రయోజనం కలిగింది?
రైతు: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాకు రుణ మాఫీతో ఎంతో ఉపశమనం కలిగింది. మీ మేలు మరువలేం.
రైతు: నా పేరు పుచ్చకాయల వెంకటేశ్వర చౌదరి, మాది ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపి.
సీఎం: ఇంకా రైతులకు ఏం చేస్తే బాగుంటుంది?
రైతు: పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకొనే విధంగా చేయాలి సార్‌! అలా అయితే రాష్ట్రంలో రైతులు తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తారు.
సీఎం: నువ్వు పండించే పంటను నువ్వు నిర్ణయించినధరకే అమ్ముకో! పోటీ పెరిగింది నాణ్యమైన వస్తువునే వినియోగదారులు కోరుకుంటున్నారు. రైతులు ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర వచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలతో మాట్లాడుతున్నాం. పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నాం. విదేశాల్లో కూడా బియ్యం అమ్ముకునేందుకు అడ్డంకులు తొలగించాం.
రైతు: నా పేరు వెంకటనారాయణ, టంగుటూరు మండలం ఆలకూరపాడు.
సీఎం: నువ్వు బ్యాంకు నుంచి ఎంత అప్పు తీసుకున్నావు? ఎంత సొమ్ము అందింది?
రైతు: రూ.1.50 లక్షల అప్పు తీసుకున్నాను. మొదట రూ.30 వేలు, ఇప్పుడు రూ.30వేలు ఇస్తున్నారు.
సీఎం: మొత్తం ఒకేసారి ఇవ్వటం లేదని నీకు నామీద కోపం లేదా?
రైతు: ఎందుకు సార్‌! మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నా ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా ఇక్కడ రైతు రుణ మాఫీ చేశారు.
సీఎం: కొంత మంది విమర్శిస్తున్నారు కదా?
రైతు: అలా అనడం మంచిది కాదు. మాకు ప్రభుత్వం ఇస్తున్న రుణ మాఫీ సొమ్ము వల్ల ఎంతో ఉపశమనం లభిస్తోంది.
రైతు: నా పేరు పోలవరపు చెంచురామయ్య, మాది ఒంగోలు మండలం కరవది.
సీఎం: ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది?
రైతు: గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది సార్‌! గతంలో అధికారుల వద్దకు తిరిగినా పనులు జరిగేవి కావు. ఇప్పుడు అధికారులే మా గ్రామాలకు వస్తున్నారు. వ్యవసాయం ఎలా చేయాలో చెబుతున్నారు. దీంతో సాగు సులభమైంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
నీటి బొట్టు.. ఒడిసిపట్టి
 
636031103783982966.jpg
  • భారీగా పెరిగిన భూగర్భ జలాలు
  • సీమ జిల్లాల్లో 5.71 మీటర్ల వరకూ పెరుగుదల
  • అదే స్ఫూర్తితో మరిన్ని నిధులు
  • నీరు ప్రగతికి ఈ ఏడాది రూ.5,568 కోట్లు
హైదరాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెరువుల్లో పూడికతీత వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుగు పట్టి.. పారతో మట్టితీసి.. నెత్తినమోసి, పొక్లయిన్లను స్వయంగా నడిపి... అధికారులు, ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాలను అమలుచేసిన ప్రభుత్వం.. వాటిని ఇప్పుడు సమీక్షించుకుంటే ఆశించిన లక్ష్యం నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున 0.99 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. కరువు ప్రాంతమైన రాయలసీమలో అనూహ్యంగా 5.71 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. భూమ్మీదపడే ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకుని.. ఇంకిపోయేవిధంగా చేయడంతో ఇది సాధ్యమయింది. చెరువుల్లో పూడికతీత, ఇంకుడు గుంతల తవ్వకం, చెక్‌ డ్యాం నిర్మాణాలు, పంట సంజీవని పథకాలతో వచ్చిన ఫలితాలపై భూగర్భ జల వనరుల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
 
ఈ కార్యక్రమాల కోసం 2015-16లో ప్రభుత్వం 2,466 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అధికారులు తెలిపారు. చెరువుల్లో పూడిక తీయడం ద్వారా 6.61 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్య్థం పెరిగిందని అధికారులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీనివల్ల 68,095 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరింది. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులు తమ పొలాలను మెరకచేసేందుకు ఉపయోగించుకున్నారు. ఇంకుడు గుంతలు తీసే కార్యక్రమం ద్వారా 7.70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పంట సంజీవని కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో 1,14,882 పంట కుంటలను తవ్వించారు. తద్వారా వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఫలితాలు రాయలసీమలో ఎక్కువగా కనిపించాయి. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
 
బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి ఏర్పడింది. దాంతో సాగునీరుతోపాటు, తాగునీటికీ ఇబ్బందిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కరువు తాండవించింది. రైతులు అప్పులు చేసి తమ పొలాల్లో బోర్లు వేయిస్తే నీరుపడలేదు. వందల అడుగుల లోతున బోర్లు వేయించినా ఫలితం ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాయలసీమలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాయలసీమలో భూగర్భ జలాలు 5.71 మీటర్ల వరకు పెరిగాయి. గత ఏడాది మే నెలలో 21.95 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది మే 15వ తేదీ నాటికి 16.24 మీటర్ల లోతులోనే లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున భూగర్భ జలాలు 0.99 మీటర్లు పెరిగాయి. గత ఏడాది మేలో 13.83 మీటర్లు ఉండగా, ఈ ఏడాది మే 15నాటికి 12.84 మీటర్లలో జలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 16.66 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగి.. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కడప జిల్లాలో 8.42 మీటర్లు, నెల్లూరు జిల్లాలో 2.93 మీటర్లు, అనంతపురంలో 2.35 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. 2015 జూన నుంచి ఈ ఏడాది మే నెల వరకు రాష్ట్రం మొత్తం మీద భూగర్భంలో అదనంగా వంద టీఎంసీల నీరు నిల్వ అయింది. నీరు-ప్రగతి, పంట సంజీవని కార్యక్రమాల ద్వారా రైతులు, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఇది సాధ్యమయింది.
 
ఈ ఏడాది భారీ లక్ష్యాలు
గత ఏడాది వచ్చిన ఫలితాలతో ఈ ఏడాది ప్రభుత్వం ‘నీరు- ప్రగతి’కి 5,568 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.05 లక్షల నీటి గుంటలను పొలాల్లో తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 33.305 చెరువులు మరమ్మతులు చేయించాలని, 12,612 వేల చెక్‌ డ్యాంలు నిర్మించాలని, భూగర్భ జలాలు రీఛార్జి అయ్యే నిర్మాణాలు 41 వేల వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్ధేశించింది. చెరువుల్లో పూడికతీత, లిఫ్ట్‌ ఇరిగేషన పథకాల ద్వారా 25 టీఎంసీల వరకు నీటి నిల్వలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
 
జల సంరక్షణతో సత్ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల సంరక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జల సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తుండటంపై శనివారం ఆయన ట్వీటర్‌లో స్పందనను తెలిపారు. వేసవిలో చేపట్టిన ఇంకుడుగుంతల తవ్వకం, పంట సంజీవిని, నీరు-ప్రగతి వంటి కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో భూగర్భ జలమట్టం 5.71 మీటర్లకు పెరిగినట్లు చంద్రబాబు వివరించారు. 2015 మే నెలలో రాయలసీమలో భూగర్భ జలాలు 21.95 మీటర్ల లోతులో ఉండేవని, ఈ ఏడాది మేనాటికి 16.24 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలం 0.99 మీటర్లకు పెరిగిందని, దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు కలిగిందని తెలిపారు.
Link to comment
Share on other sites

రైతుకు సబ్సిడీ పరికరాలు: వ్యవసాయ శాఖ
 
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘వ్యవసాయమేదీ - ఖరీఫ్‌ మొదలైనా అందని సబ్సిడీ పరికరాలు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ పరికరాల పంపిణీని వెంటనే చేపడుతున్నట్లు ఆ శాఖ డైరెక్టర్‌ ధనుంజయరెడ్డి తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పరికరాల కోసం మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశాలిచ్చామన్నారు.
Link to comment
Share on other sites

సూక్ష్మ సేద్యానికి రాయితీ పరిమితి పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు కింద రాయితీ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సంచాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై) కింద అందిస్తున్న ఈ రాయితీపై వ్యవసాయ, సహకారశాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి చిరంజీవ్‌ చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రస్తుతం రూ.లక్ష వరకు రాయితీ ఉంటే దాన్ని రూ.2 లక్షల వరకూ పెంచారు. ఎస్సీ, ఎస్టీయేతర రైతులు, మధ్యతరగతి కాని రైతులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అన్ని జిల్లాల్లో మధ్యతరగతి రైతులకు ఇచ్చే రాయితీ రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలు చేశారు. ఇతర రైతులకు ఇచ్చే రాయితీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచారు. వ్యవసాయ,

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...