Jump to content

Top Private universities in Amaravati


Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Guest Urban Legend

రేపు ‘అమృత విద్యాపీఠం’ శంకుస్థాపన

636534955459700791.jpg

మంగళగిరి: సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. మంగళగిరి మండలం కురగల్లు, యెర్రబాలెం గ్రామాల మధ్య అమృత విద్యాపీఠ్‌ మాతా అమృతానందమయి ఆర్గనైజేషన్‌ తరఫున 150 ఎకరాల్లో ఏర్పాటుకానున్న విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం శంఖుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయరావు పరిశీలించారు. సభావే దిక, శంకుస్థాపన జరిగే ప్రాంతం, హెలీప్యాడ్‌ పరిశీలించి వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
 
    ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సుమారు ఐదువేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నామని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణ ఇన్‌ఛార్జి స్వామి సదాశివచైతన్య మాట్లాడు తూ భారతదేశంలో ఇది ఏడవ ప్రాంగణమని చెప్పారు. మొదటిదశలో 150 ఎకరాలలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సును, సెకండ్‌ ఫేజ్‌లో మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి, మూడో ఫేజ్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫస్ట్‌ఫేజ్‌లో ఇంజనీరింగ్‌లో 640 సీట్లు, మేనేజ్‌మెంట్‌లో 120 సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు స్వామీజీ తెలిపారు. మొదటిదశలో రూ.150 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 2018 ఆగస్టు నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. అమృత ప్రాంగణ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు జగ్గారపు రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

18 hours ago, subbu_chinna said:

Tommorow bhoomi Pooja 

 

5 hours ago, Urban Legend said:

రేపు ‘అమృత విద్యాపీఠం’ శంకుస్థాపన

636534955459700791.jpg

మంగళగిరి: సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. మంగళగిరి మండలం కురగల్లు, యెర్రబాలెం గ్రామాల మధ్య అమృత విద్యాపీఠ్‌ మాతా అమృతానందమయి ఆర్గనైజేషన్‌ తరఫున 150 ఎకరాల్లో ఏర్పాటుకానున్న విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం శంఖుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయరావు పరిశీలించారు. సభావే దిక, శంకుస్థాపన జరిగే ప్రాంతం, హెలీప్యాడ్‌ పరిశీలించి వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
 
    ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సుమారు ఐదువేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నామని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణ ఇన్‌ఛార్జి స్వామి సదాశివచైతన్య మాట్లాడు తూ భారతదేశంలో ఇది ఏడవ ప్రాంగణమని చెప్పారు. మొదటిదశలో 150 ఎకరాలలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సును, సెకండ్‌ ఫేజ్‌లో మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి, మూడో ఫేజ్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫస్ట్‌ఫేజ్‌లో ఇంజనీరింగ్‌లో 640 సీట్లు, మేనేజ్‌మెంట్‌లో 120 సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు స్వామీజీ తెలిపారు. మొదటిదశలో రూ.150 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 2018 ఆగస్టు నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. అమృత ప్రాంగణ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు జగ్గారపు రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

TFS

Link to comment
Share on other sites

Guest Urban Legend

Live from the laying of Foundation stone of Amrita Vishwa Vidyapeetham, Amaravati campus by CM Nara Chandrababu Naidu

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
ఎస్‌ఆర్‌ఎంలో రూ.500 కోట్లతో నూతన ప్రాజెక్టు
22-04-2018 00:31:41
 
నీరుకొండ (మంగళగిరి రూరల్‌) ఏప్రిల్‌ 21: ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమరావతి ప్రాంగణంలో నూతన ప్రాజెక్టులను తీసుకువస్తున్నట్టు ప్రొ-వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ నారాయణరావు శనివారం తెలిపారు. రూ.500 కోట్లతో సెకండ్‌ ఫేజ్‌లో భవన నిర్మాణానికి ఈ నెల 25న శంకుస్థాపన చేస్తునట్టు, 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనున్నట్టు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

బీఆర్‌ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టులో కదలిక!
నేల చదును కార్యక్రమం ప్రారంభం
త్వరలో ఐయూఐహెచ్‌ మెడిసిటీ పనులూ
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఎట్టకేలకు కొంత కదలిక వచ్చింది. అబుదాబీకి చెందిన బీఆర్‌షెట్టి, బ్రిటన్‌కు చెందిన ఇండోయూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) సంస్థలు అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బిఆర్‌ షెట్టి సంస్థకు మెడిసిటీ ప్రాజెక్టు కోసం దొండపాడు వద్ద సీఆర్‌డీఏ 100 ఎకరాలు కేటాయించింది. ప్రాజెక్టుకి 2017 ఆగస్టులోనే శంకుస్థాపన జరిగింది. వివిధ కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం చోటుచేసుకుంది. ఈ నెల 13న సీఆర్‌డీఏకి, బీఆర్‌ షెట్టి సంస్థకు మధ్య భూముల అమ్మకపు ఒప్పందం (అగ్రిమెంట్‌ ఫర్‌ సేల్‌) జరిగింది. ఆ సంస్థకు సీఆర్‌డీఏ భూమి ఇది వరకే అప్పగించింది. ఆ ప్రదేశంలో నేల చదును చేసే పనుల్ని సంస్థ ప్రారంభించింది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. అమరావతి మెడిసిటీ ప్రాజెక్టుకి సంబంధించి వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలతో బీఆర్‌ షెట్టి సంస్థ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్టుపై తొలి దశలో ఆ సంస్థ రూ.6,500 కోట్లు వెచ్చించనుంది. బీఆర్‌ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టులో భాగంగా 11 విభాగాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వాటిలో వైద్య విశ్వవిద్యాలయం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థ, స్టెమ్‌ సెల్‌ విభాగం, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌, క్వాంటమ్‌ అనలిటిక్స్‌, నాచురోపతి-యోగా, 3నక్షత్రాల హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్లు వంటివి ఉన్నాయి. ఆ సంస్థ మొదట ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయనుంది.

భారీ స్థాయిలో ఇండో-యూకే ప్రాజెక్టు
లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్‌ కళాశాల ఆసుపత్రి భాగస్వామ్యంతో ఐయూఐహెచ్‌ సంస్థ అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టుని చేపట్టనుంది. యర్రబాలెం గ్రామానికి సమీపంలో ఈ ప్రాజెక్టుకి సీఆర్‌డీఏ స్థలం కేటాయించింది. తొలి దశలో 50 ఎకరాలు ఇచ్చింది. తొలి దశ ప్రాజెక్టు పూర్తయితే, మరో 100 ఎకరాలు కేటాయించనుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి త్వరలోనే అమ్మకపు ఒప్పందం జరగనుంది. అవసరమైన పత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకీ 2017 ఆగస్టులోనే శంకుస్థాపన జరిగింది. ప్రాజెక్టులో జాప్యం జరుగుతుండడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌ వెళ్లినప్పుడు ఆ సంస్థ సీఈఓ అజయ్‌ రాజన్‌గుప్తాతో చర్చించారు. మొదట ఒక క్లినిక్‌ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు ప్రారంభించాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టులో తొలిదశలో ఐయూఐహెచ్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు వల్ల 10 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా వేయి పడకల కింగ్స్‌ కళాశాల ఆసుపత్రి, నర్సింగ్‌ స్కూల్‌, పారామెడికల్‌ శిక్షణ కేంద్రం, క్యాన్సర్‌ యూనిట్‌ వంటివి ఏర్పాటవుతాయి. ఐదు నక్షత్రాల హోటల్‌నూ నిర్మిస్తారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...