Jump to content

pulichintala project


Recommended Posts

పులిచింతల భూ సేకరణకు 66 కోట్లే ఇస్తాం
31-08-2016 02:45:54
  • రూ.115 కోట్లు ఇవ్వడం కుదరదు
  • ఐడీసీ పథకాలతో సంబంధం లేదు
  • తెలంగాణకు స్పష్టం చేయనున్న ఏపీ
హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజల సహాయ, పునరావాసాలకు సంబంధించి రూ.66 కోట్లు మాత్రమే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ స్పష్టం చేయనుంది. ఏపీ, తెలంగాణ సరిహద్దులో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లా నెమలిపురి గ్రామం ముంపునకు గురవుతుందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే సాగు నీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) నిర్మించిన 4 పథకాలూ ముంపున కు గురయ్యాయని తెలంగాణ నీటి పారుదల శాఖ వాదిస్తోంది. భూ సేకరణకు సంబంధించి రూ.66 కోట్లను విడుదల చేయడంతోపాటు.. ముంపునకు గురైన 4 ఐడీసీ ప్రాజెక్టులకు మరో రూ.49 కోట్లను కలుపుకుని.. మొత్తం రూ.115 కోట్లను చెల్లించాలని ఏపీ జల వనరుల శాఖను తెలంగాణ జల వనరుల శాఖ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం పంపింది. వీటిని పరిశీలించిన ఏపీ.. భూ సేకరణకు సంబంధించి రూ.66 కోట్లను మాత్రమే చెల్లిస్తామని, ఐడీసీ పథకాలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పేందుకు సిద్ధమైంది. పులిచింతల ప్రాజెక్టును నిర్మించేందుకు 1988లో రూ.188 కోట్ల అంచనా వ్యయంతో నాటి సీఎం ఎన.టి.రామారావు శంకుస్థాపన చేశారని, తర్వాత.. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఈ పథకం పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారని, 2013 డిసెంబర్‌ 7న నాటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారని వివరించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లు ఆమోదం పొంది ప్రకటన చేశాక.. ముంపు గ్రామాలేమిటో స్పష్టమవుతుందని తెలంగాణకు ఏపీ వివరించనుంది. అదేవిధంగా 1995లో మరోదఫా ఈ ప్రాజెక్టుపై సమగ్ర ప్రకటన వెలువడిందని గుర్తు చేసేందుకు సిద్ధమైంది. ఒక పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు.. గ్రామాలు ముంపునకు గురవుతాయన్న ప్రాథమిక అవగాహన లేకపోవడం ఏమిటని తెలంగాణను ఏపీ ప్రశ్నించనుంది.
Link to comment
Share on other sites

ee project actual dam AP lo kada vundi? some villages under it are in Guntur & Nalgonda. Guntur dist. lo 100% villages khaali ayyayi, nalgonda side 9 villages khaali chesaru as amount is paid by AP govt. Rest of 4 villages ki kooda amount ichhi khaali chesyithe mothham project AP loki vasthundi including these villages.

Link to comment
Share on other sites

‘పులిచింతల’ గేట్లు ఎత్తకూడదని ప్రభుత్వ నిర్ణయం
31-08-2016 10:04:39
విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా గేట్లు ఎత్తవద్దని నిర్ణయించారు. అలాగే గతేడాది 13.5 టీఎంసీల నీటిని నిల్వచేశామని, ఈ ఏడాది 15 టీఎంసీల వరకు నీటి నిల్వ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 13 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత ఇన్‌ఫ్లో 30 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇదాలి ఉండగా... ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశమన్నందున వెల్లటూరులో గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయించారు.
Link to comment
Share on other sites

 

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పులిచింతల గేట్లను వెంటనే ఎత్తాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావును కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉమా మహేశ్వర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు కింద నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా పూర్తికాలేదని ఉమామహేశ్వర్‌రావుకు తెలిపారు. పులిచింతలకు వస్తున్న వరదనీటిపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించి, నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్, ఈఎన్‌సీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

12 tmc ke ila vundhi situation ...

45 tmc eppatiki store cheyyochu emanna works pending vunnaya other than package to villagers

Link to comment
Share on other sites

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు
 
విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. గత రెండు రోజులుగా బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు వస్తోంది. కాగా... ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. అలాగే డెల్టా కాలువలకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Prakasam and Pulichintala madya lo any chance of reservoir with another 30 to 40 tmc storage

 

Antha big reservior impossible because upwards lo nalgonda is there 

 

Already Amaravati dagara oka bridge cum dam 15tmc proposal undi adi complete chesthe 15tmc+3tmc(prakasham barrage)+Pulichintala(45tmc) = 63tmc storage vastundi.

 

If we can fill with Godavari water every year 3 times it will be sufficient for 1 year crops in krishna delta

Link to comment
Share on other sites

పులిచింతలకు..వరద
 
636082257891737299.jpg
గుంటూరు, ఆంధ్రజ్యోతి/అచ్చంపేట: పల్నాడులో కురుస్తోన్న భారీ వర్షాలకు తోడు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తోండటంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఇంచుమించు 50 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే డ్యాంలో 9 టీఎంసీల నీరు నిల్వ కాగా, ఇది మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ఇరిగేషన శాఖను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశించారు. సర్కిల్‌ కార్యాలయ ఎస్‌ఈ కేవీఎల్‌ఎనపీ చౌదరి వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
పెరిగిన వాగుల ప్రవాహం
సత్తెనపల్లి, నకరికల్లు, మాచర్ల, రాజుపాలెం, పిడుగురాళ్ల, ముప్పాళ్ల, మాచవరం, నరసరావుపేట, కారంపూడి, బెల్లంకొండ, రొంపిచర్ల, దుర్గి, అచ్చంపేట తదితర మండలాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పులిచింతల డ్యాం ఎగువున కృష్ణానదిలో కలిసే వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. పిల్లేరు, నాగులేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్గొండ జిల్లా నుంచి మూసీ నదిలోనూ వరద పోటెత్తుతోంది. దీంతో పులిచింతల డ్యాంకు 50 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్‌లో విద్యుత ఉత్పత్తిని చేసి కొంత మోతాదులో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో మంగళవారం 10.9 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. డ్యాంలో నీటి ప్రవాహం పెరిగిన కారణంగా ముంపు గ్రామాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. గుంటూరు జిల్లా వైపున గ్రామాలను దాదాపుగా రెవెన్యూ శాఖ ఖాళీ చేయించింది. నల్గొండ జిల్లాలో నేటికి ముంపు గ్రామాల్లో ప్రజలు నివసిస్తుండటంతో వారిని ఖాళీ చేయించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.
డెల్టాకు నీటి విడుదలను నిలిపేయండి
ఐదు రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తోండటంతో కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీటి విడుదలను నిలిపేయాల్సిందిగా రైతుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన ఎస్‌ఈ చౌదరి ప్రకాశం బ్యారేజ్‌ ఎస్‌ఈతో మాట్లాడి కేడబ్లూడీ ప్రధాన కాలువకు నీటి విడుదలను నిలుపుదల చేయించారు. పట్టిసీమ నుంచి వస్తోన్న వరద నీటిని బ్యారేజ్‌లో నిల్వ చేయడం ప్రారంభించారు. ప్రకాశం బ్యారేజ్‌లో మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 11.7 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్‌లో 12.5 అడుగుల వరకు నీటి నిల్వ చేసుకునే అవకాశం ఉందని, అంతకంటే ఎక్కువ మోతాదులో వరద వస్తే దిగువకు విడుదల చేస్తామని ఇరిగేషన అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించాల్సిందే : ఏపీ
 
636082548653180132.jpg
విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించాల్సిందేనని తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించామని, తెలంగాణ పరిధిలోని ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చినా ఎందుకు ఖాళీ చేయించలేదని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.8 అడుగుల నీరు ఉంది. 60వేల క్యూసెక్కుల ఇనఫ్లో కొనసాగుతోంది. ఫలితంగా పులిచింతలలో 13.1 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తాము 15 టీఎంసీల నీళ్లు నిలవ చేస్తామని చెప్పింది. కృష్ణా డెల్టా స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఏపీ స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...