Jump to content

pulichintala project


Recommended Posts

  • 3 months later...
  • 2 weeks later...
నల్గొండ : నాగార్జున సాగర్‌ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. రేపటిలోగా సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు నీరు చేరుకునే అవకాశం ఉంది. దీంతో రేపు సాగర్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
 
సాగర్‌ గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాల్లోని పులిచింతల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్‌ దిగువ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Link to comment
Share on other sites

13 minutes ago, rk09 said:
నల్గొండ : నాగార్జున సాగర్‌ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. రేపటిలోగా సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు నీరు చేరుకునే అవకాశం ఉంది. దీంతో రేపు సాగర్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
 
సాగర్‌ గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాల్లోని పులిచింతల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్‌ దిగువ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

 

krishna lo manam chudani anni "reserve storage undi" e debbato....puli 35 tmc extra in-addition to sagar&srisailum fulll..

best part is seema reservoirs that were complete all are filled with handri eventhough no rain.....

 

X9BnqV.gif

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

25 minutes ago, AnnaGaru said:

 

krishna lo manam chudani anni "reserve storage undi" e debbato....puli 35 tmc extra in-addition to sagar&srisailum fulll..

best part is seema reservoirs that were complete all are filled with handri eventhough no rain.....

 

X9BnqV.gif

ee year super

The power that was saved by pattiseema should compensate for HNSS 

looks like ee year pattiseema nunchi 80 kuda teesukomu yemo

Sept rains kuda vasthe - rabi lo kuda paddy vesukovatchu

but last year Krishna delta lo panta baga pandindi kani rates leka - no loss no gain type lo vundi (including family expenses) mainly beacuse of minumulu

Link to comment
Share on other sites

పులిచింతల వైపు కృష్ణమ్మ
ఈ ఏడాది పూర్తిస్థాయి  నీటినిల్వకు ప్రణాళిక
సాగర్‌ టెయిల్‌పాండ్‌  5 గేట్లు ఎత్తివేత
కృష్ణానదిలో పెరుగుతున్న నీటి ప్రవాహం
31ap-main18a.jpg

ఈనాడు-గుంటూరు, మాచర్ల, రెంటచింతల, న్యూస్‌టుడే: కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతుండటంతో నదిలో నీటిప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరువ కావడంతో దిగువకు నీటివిడుదల మొదలైంది. నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా 35వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌ దిగువన ఉన్న సత్రశాల టెయిల్‌పాండ్‌ డ్యామ్‌ నిండిపోవడంతో శుక్రవారం 5గేట్లు ఎత్తి పులిచింతలకు విడుదల చేశారు. అనుకున్న సమయానికన్నా ముందుగానే ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు ఎస్‌ఈ శేషారెడ్డి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా గతంలో 33 టీఎంసీలు నిల్వచేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 115 కిలోమీటర్ల మేర నది ప్రయాణిస్తుంది. దీంతో ఉదయం విడుదల చేసిన నీరు ఇంకా పులిచింతలకు ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. శుక్రవారం సాయంత్రానికి 29,399 క్యూసెక్కుల నీరు చేరుతుండగా కృష్ణాడెల్టా అవసరాలకు 5094 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

శ్రీశైలానికి పెరుగుతున్న వరదనీరు
శ్రీశైలం ప్రాజెక్టుకు 1,29,350 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల, తుంగభద్ర నుంచి 2లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదలైంది. ఈ నీరు దిగువకు విడుదల చేస్తారు. శ్రీశైలం గరిష్ఠమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.1 అడుగులతో 205.23టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా 582.5 అడుగులు నీటినిల్వతో 290.23 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి వరదనీటి నిర్వహణ చేపడుతారు. సాగర్‌ కుడి, ఎడమ కాలువలకు 10వేల క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1500క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 35వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 22 టీఎంసీలు మాత్రమే నిల్వచేసే వెసులుబాటు ఉంది. ఎగువనుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి 585 అడుగులకు నీరు చేరిన తర్వాత గేట్ల ఆపరేటింగ్‌పై నిర్ణయం తీసుకుంటారని జలవనరులశాఖ ఇంజినీరు చెప్పారు. విద్యుదుత్పత్తి, కాలువలకు కలిపి 50 వేల క్యూసెక్కులకు మించి విడుదల చేసే అవకాశం లేనందున వరద పెరిగితే గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తారు.

31ap-main18b.jpg

పులిచింతలలో పూర్తయిన పునరావాసం: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొన్నిగ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన పునరావాస కార్యక్రమాలు పూర్తయినందున ప్రాజెక్టులో గరిష్ఠ నీటినిల్వకు మార్గం సుగమమైందని గుంటూరు జిల్లా సంయుక్తపాలనాధికారి ఏఎండీ. ఇంతియాజ్‌ తెలిపారు. నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నందున ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఖాళీచేయాలని రెవెన్యూవర్గాలకు సమాచారం ఇచ్చామని పులిచింతల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీరు జె.రమేష్‌బాబు చెప్పారు. మూడురోజుల్లో నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసేందుకు కసరత్తు పూర్తిచేశామన్నారు. పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం వల్ల కృష్ణాడెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీటికి భరోసా లభిస్తుంది.

Link to comment
Share on other sites

చింత తీరేనా? 
పశ్చిమ డెల్టాలో సాగు నీటి కష్టాలు 
7500 క్యూసెక్కులు అవసరం 
సాయంత్రం నుంచి విడుదల పెంపు 
న్యూస్‌టుడే, బాపట్ల 

కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి సాగుకు నీటి కొరత ఏర్పడింది. పట్టిసీమ నుంచి జూన్‌ 20నే నీటిని విడుదల చేసినా పంట సాగులో జాప్యం చోటుచేసుకుంది. వెద పద్ధతిలో సాగు చేసిన 50 వేల హెక్టార్లలో పైరు భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతినడంతో మళ్లీ నాట్లు వేయాల్సివచ్చింది. దాంతో అన్నదాతలంతా ఒకేసారి ఆయా పనులకు దిగడంతో నీటి డిమాండ్‌ బాగా పెరిగింది. ప్రకాశం బ్యారేజీ నుంచి శనివారం ఉదయం వరకు ఐదు వేల క్యూసెక్కులే వదలగా కాల్వల కింద చివరి ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. డీజిల్‌ ఇంజన్లతో నీటిని తోడి తడులు ఇస్తున్నారు. పులిచింతల నుంచి నీరు వస్తున్నందున ఆదివారం ఉదయం నుంచి 7,500 క్యూసెక్కులు విడుదల చేసి నాట్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని జలవనరుల శాఖాధికారులు అంటున్నారు.

ఎకరాకు రూ.6,600 నష్టం 
డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని జూన్‌ మూడో వారంలోనే ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు వదిలారు. ఆ సమయంలో వరి సాగుకు రైతులు సన్నద్ధం కాలేదు. కాల్వల్లో పనులు పూర్తి చేయకపోవటంతో జులై మూడో వారం వరకు పొలాలకు నీరందించలేదు. లక్షన్నర ఎకరాల్లో వెద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో వచ్చిన మొలకలు చనిపోకుండా ఉండటానికి డీజిల్‌ ఇంజన్ల ద్వారా తడులు ఇచ్చారు. గత నెల 9 నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అధిక వర్షాలకు వెద పద్ధతిలో వేసిన వరి పైరు నీట మునిగి కుళ్లిపోగా ఎకరాకు రూ.6,600 నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి 30 టీఎంసీలు రాగా పశ్చిమ డెల్టా పరిధిలో 16.33 టీఎంసీలను వినియోగించారు.

ఒకేసారి నాట్లతో సమస్య 
వర్షాలు బాగా కురవటంతో రైతులంతా ఒకేసారి నాట్లు వేయటం ప్రారంభించారు. డెల్టా ఆయకట్టు పరిధిలోని ప్రకాశం జిల్లాలోనూ నారుమడులు పోశారు. దీంతో ఒక్కసారిగా సాగునీటి అవసరం బాగా పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం వరకు పట్టిసీమ నుంచి 7,500, స్థానికంగా మరో 1,500 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది. పశ్చిమ డెల్టాకు ఐదు వేల క్యూసెక్కులు వదలగా కొమ్మమూరు కాల్వకు కేవలం 2 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికే 3.70 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. మరో రెండు లక్షల ఎకరాల్లో వాటిని వేయాల్సివుండగా ఈ ఆయకట్టు ఎక్కువగా బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో ఉంది.

అదనపు ఖర్చు 
నాట్లు వేయటానికి పొలాలకు సరిపడా నీరు అందటం లేదు. ఆయిల్‌ ఇంజన్లతో తోడి నింపాల్సివస్తోంది. దీని కోసం ఎకరాకు అదనంగా రూ.వెయ్యి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమ్మమూరు, నిజాంపట్నం, బ్యాంకు కాల్వల పరిధిలో చివరి ఆయకట్టు భూములకు నీరు సక్రమంగా అందక వారంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. నీటి ఇబ్బంది కారణంగా నాట్లు వేయటంలో జాప్యం చోటుచేసుకుంటోంది. రైతులు, ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి కాల్వలకు నీటి విడుదల పెంచాలని కోరారు. పశ్చిమ డెల్టాకు 7,500 క్యూసెక్కులు వదిలితేనే చివరి ఆయకట్టుకు అందుతాయి. పులిచింతల నుంచి విడుదల చేసిన 5,129 క్యూసెక్కులు శనివారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి చేరతాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను 5 వేల నుంచి ఆరు వేల క్యూసెక్కులకు అధికారులు పెంచారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొమ్మమూరు కెనాల్‌కు 2,500, బ్యాంక్‌ కెనాల్‌కు 1,200, తూర్పు కాల్వకు 670, పశ్చిమ కాల్వకు 200, నిజాంపట్నం ఛానల్‌కు 400, హైలెవల్‌ ఛానల్‌కు 280, మెయిన్‌ కెనాల్‌కు 250 క్యూసెక్కులు వదిలారు. ఆదివారం ఉదయం నాటికి నీటి విడుదలను ఏడు వేల క్యూసెక్కులకు పెంచుతామని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నీరు పొలాలకు చేరుకోవాలంటే రెండ్రోజుల సమయం పడుతుంది. అప్పుడే వెంటనే నాట్లు వేయగలుగుతారు. మరో వైపు నాగార్జునసాగర్‌ నుంచి 23,822 క్యూసెక్కులు పులిచింతలకు వస్తున్నాయి. సాగర్‌ జలాశయం గేట్లు ఆదివారం ఎత్తి ఏ సమయంలోనైనా మరింత నీటిని దిగువకు విడుదల చేయనున్నందున రైతుల్లో ఆశలు చిగురించాయి.

నాట్లకు పుష్కలంగా నీరిస్తాం 
పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయటానికి శనివారం ఉదయం వరకు కొంత ఇబ్బంది ఉన్నా ప్రకాశం బ్యారేజీలోకి పట్టిసీమతోపాటు పులిచింతల నుంచి ఐదు వేల క్యూసెక్కులు వచ్చి చేరటంతో అదీ పరిష్కారమైంది. కాల్వలకు నీటి విడుదల పెంచాం. కొమ్మమూరు కెనాల్‌కు ఆదివారం ఉదయానికి 2,800 క్యూసెక్కులు వదిలి చివరి ఆయకట్టులోనూ నాట్లు వేయటానికి అవసరమైన నీరందిస్తాం. సాగర్‌ జలాశయం నిండినందున పులిచింతల, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి పుష్కలంగా నీరు వస్తుంది. ఖరీప్‌లో వరి సాగుకు నీటి సమస్య తలెత్తదు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...