Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

http://

 

d2na0fb6srbte6 dot cloudfront dot net/read/imageapi/clipimage/1052443/f6561c34-9c93-4b51-8a36-ec7abd4147ed

 

వెలగపూడిలోనే శీతాకాల సమావేశాలు: కోడెల 

29-12-2016 03:44:48

636186094593862962.jpg
కారంపూడి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి నెలాఖరులో జరుగుతాయని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరుజిల్లా కారంపూడిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయన్నారు. వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ సమావేశాల భవనం అందరికీ సౌకర్యంగా ఉంటుందని అన్నారు.
 
 

 

Link to comment
Share on other sites

వడివడిగా ‘అసెంబ్లీ’
 
636192678851838300.jpg
  • వెలగపూడిలోనే తదుపరి సమావేశాలు!
  • పనులను పరిశీలించిన కోడెల
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయం ఆవరణలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనంలోనే శీతాకాల, బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గురువారం ఆయన నిర్మాణంలో ఉన్న శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి అయిన దాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామని కోడెల తెలిపారు. జనవరి నెలాఖరు కల్లా భవన నిర్మాణం పూర్తి చేస్తే, ఫిబ్రవరి మొదటి వారంలో శాసనసభ శీతాకాల సమావేశాలు, మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి కాకపోతే శీతాకాల, బడ్జెట్‌ సమావేశాలు కలిపి నిర్వహిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
 
వడి..వడిగా నిర్మాణ పనులు
వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఆవరణలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే భవనం శ్లాబ్‌ నిర్మాణం పూర్తయింది. సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయ పార్కింగ్‌తోపాటు సచివాలయం ఆవరణ బయట 5 ఎకరాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీకి వచ్చిన వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశమందిరాల్లో స్పీకర్‌, చైర్మన్ల పోడియం నిర్మాణాలు పూర్తయ్యాయి. మండలిలో సీటింగ్‌ కోసం మార్కింగ్‌ కూడా ఇచ్చారు. నమూనా సీట్లను కూడా మండలిలో ఏర్పాటు చేశారు. శాసన మండలిలో ఎరుపు రంగు సీట్లు, శాసన సభలో ఆకుపచ్చ రంగు సీట్లను ఏర్పాటు చేయబోతున్నారు.
 
ASSEMBLI.jpg 
Link to comment
Share on other sites

వెలగపూడిలో సిద్ధమవుతున్న శాసనసభ భవనం
 

velagapudi-assembly-06012017.jpg

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలి భవన నిర్మాణాలను పరిశీలించారు. శీతాకాల శాసనసభ సమావేశాలు డిసెంబరు నెలలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ నిర్మాణ పనులు జాప్యం కారణంగా సమావేశాలు నిర్వహించ లేదనే విషయాన్ని గుర్తించి పనులు వేగవంతం చేయాల్సి ఉన్నా మందకొడిగా సాగడం బాధాకరమన్నారు. ఈ నెలాఖరునాటికి నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ అధికారులు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను స్పీకర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా స్పీకర్ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు. కొత్త శాసనసభ, శాసనమండలిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్నాయన్నారు. విజయవాడలో ఫిబ్రవరి 10 నుండి మూడురోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని అసెంబ్లీ, శాసనమండలి భవనాలను సందర్శించే అవకాశం ఉండటంతో పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని స్పీకర్ సూచించారు.

 

అనంతరం నూతన అసెంబ్లీ శాసనమండలి భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల పార్కింగ్, భద్రత ఏర్పాట్లు, స్పీకర్ ఛాంబర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరుల ఛాంబర్లు, ప్రతిపక్ష నేతకు కేటాయించే ఛాంబర్లకు సంబంధించిన వివరాలను స్పీకర్ డాక్టర్ కోడెల సంబంధిత శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, ప్రతిపక్ష నేత, ఇతర సందర్శకుల గ్యాలరీలకు సంబంధించి స్పీకర్ స్వల్ప మార్పులను సూచించారు.

Link to comment
Share on other sites

అమరావతి లైటింగ్‌కు టెండర్లు
 
అమరావతి: అమరావతికి వెళ్లే రోడ్డు వెంబడి వీధిలైట్లు ఏర్పాటుకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. రాయపూడి ఆర్‌అండ్‌బీ రోడ్లుతో కనెక్ట్‌ అవుతున్న సీడ్‌ యాక్సెస్‌రోడ్‌ నుంచి వెలగపూడి సెక్రటేరియట్‌ వరకు ఎల్‌ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేసేందుకు ఈ టెండర్లు పిలిచారు. 1.42 కోట్లతో పిలిచిన ఈ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని బిడ్‌ నిబంధనల్లో చేర్చారు. వీటితో పాటు సీఆర్‌డీఏ పరిధిలో పలు సౌకర్యాల కల్పనకు టెండర్లు పిలిచారు. వెలగపూడి లోని ప్రభుత్వ కాంప్లెక్స్‌లో హౌస్‌కీపింగ్‌, పెస్ట్‌ కంట్రోల్‌ సర్వీసుకు సంబంధించి కాంట్రాక్టుకు బిడ్లు పిలుస్తూ నోటిఫికేషన్‌ జారీచేశారు. సీఆర్‌డీఏ కార్యాలయం సిబ్బందికి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల కొనుగోలుకు వేరుగా టెండర్లు పిలిచారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

అమరావతి: వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ అసెంబ్లీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 28నాటికి అసెంబ్లీ భవనాల పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంచిరోజు చూసి అసెంబ్లీ భవనాన్ని స్పీకర్‌ ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సచివాలయాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. రాజధానిలో అంతా తాత్కాలిక నిర్మాణాలేనని, ప్రతిపక్ష నేత విమర్శలు చేయడం సరికాదని సూచించారు.

Link to comment
Share on other sites

అమరావతి ఆహ్లాదకరం
 
636207356842727223.jpg
  • పచ్చని లోగిళ్లు..
  • శోభాయమాన రహదారులు..
  • పచ్చిక బయళ్లతో సుందరవనంగా రాజధాని
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : కొత్త రాజధాని అమరావతి సుందర నందనవనంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో రోడ్లు, పార్కులు అభివృద్ధి చేసిన రీతిలో కొత్త రాజధాని రూపుదిద్దుకుంటోంది. రాజధాని దారితీసే రోడ్లు, విజయవాడ పరిసర ప్రాంతాలు, చెరువులు, ఖాళీ ప్రదేశాలన్నీ పచ్చని మొక్కలు, పచ్చిక బయళ్లతో కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే ప్రధానమైన రహదారుల మధ్యలో, వాటికిరువైపులా పార్కులు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. కొత్త రాజధాని తాత్కాలిక సచివాలయంలో పార్కు ఏర్పాటు చేసి కొత్త శోభ తెచ్చారు. రాజధాని నగరాన్ని సకల సౌకర్యాలతో అత్యంత ఆధునికంగా, పచ్చదనం, జలకళ ఉట్టిపడేలా అద్భుతంగా నిర్మించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పచ్చిక బయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడకదారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు కూడా వెలగపూడి నుంచే ప్రారంభించారు. తాత్కాలిక సచివాలయం, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాక్‌లతో పాటు పరిసరాల్లో రూ.4.50 కోట్ల అంచనాతో పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రకరకాల పూలమొక్కలు, పచ్చని చెట్లతో తాత్కాలిక సచివాలయం కళకళలాడుతోంది.
 

కడియం, బెంగళూరు, కోల్‌కతా మొక్కలు

పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం, కోల్‌కతా, బెంగళూరుల నుంచి పలు రకాల మొక్కలు తెప్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు కనువిందు చేయనున్నాయి. 32,469 చ.మీ. లలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 42 వేల మోండో గడ్డి మొక్కల పెంపెకానికి ఏర్పాట్లు చేశారు. ఒక కిలోమీటర్‌ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. మరో 1342 మొక్కలతో నేలంతటినీ పచ్చదనంతో నింపారు. వందల రకాల పూలమొక్కలతో పాటు గడ్డిమొక్కలను కూడా తెప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి బ్లాక్‌ ఎదురుగా రెండన్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్క్‌ను రకరకాల పూలమొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని నిత్యం పూస్తూనే ఉంటాయి. ఫౌంటెన్లు ఏ ర్పాటు చేస్తారు. శాసనసభ భవనం ఎదుట కూడా పార్క్‌ ఏర్పాటుకుపనులు జరుగుతున్నాయి.
 

రోడ్ల కిరువైపులా పూల మొక్కలు
సీఆర్‌డీఏ పరిధిలో గన్నవరం నుంచి తాడిగడప క్రాస్‌రోడ్లు వరకు రోడ్డు మధ్యలో (సెంట్రల్‌ మీడియన్‌) రూ.95 లక్షలతో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఇక తుళ్లూరు చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపేస్తున్నారు.

శంకుస్థాపన ప్రదేశానికి ఉద్యాన శోభ
ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూతన రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశం పూలతోటను మరిపించేలారూపొందిస్తున్నారు. ఇక్కడ 2168 చదరపు మీటర్లు ప్రాంతాన్ని పచ్చిక బయళ్లుతో నింపుతున్నారు. మరో 260 చదరపు మీటర్ల ప్రాంతంలో మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించి హద్దుగోడలు ఏర్పాటు చేస్తారు

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...