Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

అసెంబ్లీ... ముస్తాబు అదిరింది
 
636226289203882494.jpg
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): వెలగపూడిలో శాసనసభ, శాసన మండలి భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది. లోపల రోడ్లు, ఫినిషింగ్‌ పనులు మినహా పనులన్నీ పూర్తయ్యాయి. సీఆర్‌డీఏ అధికారులు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి పేరుతో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఒకటి రెండు రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. కౌన్సిల్‌ భవనంలో పనులు మూడు నాలుగు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. అసెంబ్లీ భవనం ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలతో పార్కు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సచివాలయానికి వస్తున్న అధికారులు, ప్రజలు, నాయకులు నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని సందర్శిస్తున్నారు. కాగా, వెలగపూడిలో శాసనసభ, శాసన మండలి భవనాల నిర్మాణం ఆరు నెలల్లోనే పూర్తయ్యిందని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. సోమవారం వారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించారు. అసెంబ్లీ హాలులో సీటింగ్‌, స్పీకర్‌ పోడియం, అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన మైకులను పరిశీలించారు. పయ్యావుల కేశవ్‌, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. శాసన మండలి భవనాన్ని చైర్మన్‌ చక్రపాణి పరిశీలించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...