అమెరికా నుంచి రప్పించారు.. కులరాజకీయానికి బలిచ్చారు గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ వేధింపులు, కులరాజకీయాల కారణంగానే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అమెరికాలో హాయిగా బతుకుతున్న శ్రీదేవి దంపతులను ఇక్కడికి రప్పించి మరీ బలి చేశారని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం వరకు శ్రీదేవి, మల్లికార్జున దంపతులు అమెరికాలో ఉండేవారు. అక్కడే చిన్నచిన్న బిజినెస్లు చేస్తూ మల్లికార్జున డబ్బు సంపాదించుకున్నారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో వారిని రప్పించారు. సరైన అభ్యర్థి లేకపోవడం, మాచర్లలో ఆర్యవైశ్యుల ఓట్లన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో శ్రీదేవి దంపతులను రప్పించారు. ఎన్నికల్లో పైసా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొత్తం పార్టీ చూసుకుంటుందని నమ్మించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఏ నాయకుడు కూడా ఆర్థికంగా సాయం చేయలేదు. దీంతో పరువు పోకూడదన్న ఉద్దేశంతో శ్రీదేవి భర్త తాను అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు. శ్రీదేవి బంధువులుకూడా తలోచేయి వేసి ఆదుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక చెప్పినట్టే శ్రీదేవికి చైర్పర్సన్ పదవి అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు శ్రీదేవి పదవిపై కన్నేశారు.
శ్రీదేవిని దించేసి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మంగమ్మను చైర్పర్సన్గా చేసేందుకు పావులు కదిపారు. రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండి ఆ తర్వాత మంగమ్మకు పదవి అప్పగించాలని శ్రీదేవి ముందు టీడీపీ నాయకులు ప్రతిపాదన పెట్టారు. అందుకు శ్రీదేవి దంపతులు ససేమిరా అన్నారు. అంతే అప్పటి నుంచి ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీదేవి కుటుంబంపై చంద్రబాబు సామాజికవర్గం నేతలు కక్ష కట్టారు. శ్రీదేవి హయాంలో ఒక్క బిల్లు కూడా పాస్ కాకుండా అడ్డుకున్నారు. ఆమె చాంబర్ ముందే టీడీపీ కౌన్సిలర్ల చేత ధర్నాలు చేయించారు. శ్రీదేవికి సహకరిస్తున్నారంటూ ముగ్గురు కమిషనర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుపాలు చేశారు. ఈ ఒత్తిళ్లు భరించలేక మానసిక ఒత్తిడితో నాలుగు నెలల క్రితం శ్రీదేవి భర్త మల్లికార్జున రావు గుండెపోటుతో చనిపోయారు. అయినప్పటికీ టీడీపీ కులనాగులు శాంతించలేదు.
భర్త చనిపోయి బాధలో ఉన్న శ్రీదేవి చేత ఆమె ఇంటికే వెళ్లి రాజీనామా చేయించారు. అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్న తాను ఇక్కడికి వచ్చి భర్తను కోల్పోయి, టీడీపీ నేతల కులరాజకీయాలను ఎదిరించలేక శ్రీదేవి తీవ్రంగా మానసిక వేధనకు గురయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగేసి టీడీపీ కులరాజకీయాలకు లొంగిపోయారు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీదేవి కన్నుమూశారు. ఇప్పుడు ఆమె కుమారుడు అనాథగా మిగిలిపోయారు. ఇంత జరిగినా టీడీపీ అగ్రనాయకత్వం మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉంది. శ్రీదేవి చైర్ పర్సన్ ఉన్న కాలంలో టీడీపీ నేతలు వేధించారని ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండా అడ్డుకున్నారని మాచర్లకు చెందిన ప్రముఖ అడ్వకేట్ కర్రిసాయి మనోహన్ మీడియాతో చెప్పారు. కేవలం ఒక కులానికి చెందిన నేతల వికృత క్రీడ వల్లే శ్రీదేవి దంపతులు ప్రాణాలు కోల్పోయారని టీడీపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.
What is this ...Is it True ? Does any one have any idea please reply on it...