దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ)లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 121 దేశాలను పరిగణనలోకి తీసుకుంటే మన దేశం107వ స్థానంలో నిలిచింది. ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక(64), ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్(99) కూడా మనకంటే మెరుగైన స్థానాల్లో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. జీహెచ్ఐ వార్షిక నివేదికను కన్సర్న్ హంగర్, వెల్తుంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి.